పుల్వామా ఉగ్రదాడి నిందితుడి హతం | Pulwama Car Operative Jaish Terrorist Killed In Encounter | Sakshi
Sakshi News home page

పుల్వామా ఉగ్రదాడి నిందితుడి హతం

Jun 18 2019 7:51 PM | Updated on Jun 18 2019 7:52 PM

Pulwama Car Operative Jaish  Terrorist Killed In Encounter - Sakshi

శ్రీనగర్‌ : జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో భద్రతా బలగాలు చేపట్టిన గాలింపు చర్యల్లో భాగంగా భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో ఒక సైనికుడు మరణించారు. గాయపడిన మరో ఇద్దరు సైనికులను ఆస్పత్రికి తరలించారు. భద్రతా దళాల కాల్పుల్లో ఉగ్రవాదుల ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో పుల్వామా ఉగ్ర దాడిలో ప్రమేయం ఉన్న  సాజద్‌ భట్‌గా పోలీసులు గుర్తించారు.

మరో ఉగ్రవాదిని ఇదే దాడితో సంబంధం ఉన్న అహ్మద్ భట్‌గా గుర్తించారు. సాజద్‌ బట్‌  25 కిలోల పేలుడు పదార్థంతో ఉన్న మారుతి ఈకో కారును పుల్వామా దాడిలో ఉపయోగించారని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. సోఫీయన్‌ మదర్సాలో విద్యార్థిగా ఉన్న సాజద్‌ పుల్వామా దాడికి ముందు కొన్ని రోజలు కనిపిచంకుండా పొయినట్లు ఎన్‌ఐఏ తెలిపింది. కాగా, దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది సోమవారం హతమయ్యాడు. ఈ కాల్పుల్లో ఆర్మీ మేజర్‌ రాహుల్‌ వర్మ మరణించిన విషయం తెలిసిదే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement