యాసిడ్ బాధితులకు ఉచిత సర్జరీలు | Project to offer free surgeries for acid attack victims | Sakshi
Sakshi News home page

యాసిడ్ బాధితులకు ఉచిత సర్జరీలు

Feb 24 2016 8:18 PM | Updated on Aug 17 2018 2:10 PM

యాసిడ్ బాధితులకోసం కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన వారికి పూర్తి ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీలు నిర్వహించనున్నట్టు యాసిడ్ సర్వైవర్స్ ఫౌండేషన్ ప్రకటించింది.

ముంబై:  యాసిడ్ బాధితులకోసం కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన వారికి  ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీలు నిర్వహించనున్నట్టు  యాసిడ్ సర్వైవర్స్ ఫౌండేషన్  ప్రకటించింది. 'ప్రాజెక్ట్ రివైవ్'  పథకం కింద మార్చి 1నుంచి 12 వ తేదీవరకు  ఢిల్లీలో  ఉచితంగా ఈ ఆపరేషన్లు నిర్వహించనున్నట్టు తెలిపింది.  ఇందులో నాగాలాండ్, మిజోరం, కాశ్మీర్ వంటి రిమోట్ మరియు సుదూర ప్రాంతం సహా దేశంలోని బాధితులకు ఈ చికిత్స అందుబాటులో ఉంటుందని పేర్కొంది. 

ఈ ప్రాజెక్టు కోసం దేశ విదేశాలకు చెందిన  ప్లాస్టిక్ సర్జన్లు,  సంబంధిత నిపుణులు  పనిచేస్తున్నారని ఎఎఫ్ఎస్ఐ  మేనేజర్ మేఘ మిశ్రా తెలిపారు. దీనికి వాట్సాప్,  ఇమెయిల్ ద్వారా బాధితులు ఫోటోలను పంపాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా ఈ సర్జరీల ప్రీ స్క్రీనింగ్ నిర్వహిస్తామన్నారు. బాధితులను పూర్తిగా పరిశీలించిన మీదట ఎలాంటి  చికిత్స అందించేది నిర్ణయిస్తామని తెలిపారు. దీంతోపాటుగా, ప్రీ అండ్ పోస్ట్ ఆపరేషన్ కేర్తోపాటు,  దీర్ఘకాలం చికిత్స అవసరమైన వారికి వసతి సౌకర్యాలను 100 శాతం ఉచితంగా అందిస్తామన్నారు.   ఈ నెల 29 లోగా  బాధితుల తమ వివరాలను 9711668882 అనే నెంబరుకు వాట్సాప్ ద్వారా గానీ, మిశ్రా డాట్ మేఘ09@ జీమెయిల్.కామ్  పంపించాలని కోరారు.

యాసిడి బాధితుల సహాయార్ధం తాము  చేపట్టిన ప్రచారానికి అమెరికా , కెన్యా, అస్ట్రేలియా, జర్మనీ  తదితర దేశాల నుంచి అనూహ్యమైన  స్పందన వచ్చిందని మిశ్రా చెప్పారు.   కేవలం వైద్య సహాయం మాత్రమేకాకుండా.. బాధితులకు అవగాహనా కార్యక్రమాలను కూడా తమ సంస్థ చేపడుతుందని ఆమె  తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement