చీకట్లో విద్యుత్ మంత్రి | Power Cut During Union Power Minister's Press Conference in Delhi | Sakshi
Sakshi News home page

చీకట్లో విద్యుత్ మంత్రి

May 20 2016 6:31 PM | Updated on Sep 4 2017 12:32 AM

కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయుష్ గోయల్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు.

న్యూఢిల్లీ: కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయుష్ గోయల్ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. శుక్రవారం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో పాత్రికేయులతో మాట్లాడుతూ.. తన శాఖ సాధించిన విజయాలను, నరేంద్రమోదీ నాయకత్వంలోని తమ ప్రాధాన్యతలను వివరిస్తున్నారు.

ఈ సమయంలో ఉన్నంట్టుండి ఒక్కసారిగా పవర్ కట్ అయింది. మంత్రి కాసేపు చీకట్లోనే కూర్చున్నారు. తరువాత మళ్లీ పవర్ వచ్చిన తర్వాత ఆయన తమ శాఖ సాధించిన విజయాలపై బుక్ లెట్ ను విడుదల చేశారు.
 
   
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement