ఓబీసీల హక్కులను కాలరాయొద్దు | PM Modi surprised over Rajya Sabha blocking OBC commission bill | Sakshi
Sakshi News home page

ఓబీసీల హక్కులను కాలరాయొద్దు

Apr 13 2017 2:00 AM | Updated on Aug 15 2018 2:32 PM

ఓబీసీల హక్కులను కాలరాయొద్దు - Sakshi

ఓబీసీల హక్కులను కాలరాయొద్దు

ఇతర వెనుకబడిన కులాల ప్రజల హక్కులను వారికి అందకుండా విపక్షాలు అడ్డుకుంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా విమర్శించారు.

విపక్షాలపై మోదీ విమర్శలు
న్యూఢిల్లీ: ఇతర వెనుకబడిన కులాల ప్రజల హక్కులను వారికి అందకుండా విపక్షాలు అడ్డుకుంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా విమర్శించారు. ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించే బిల్లు–2017 (రాజ్యాంగ సవరణ–123వ)కు సంబంధించి రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా ప్రధాని ఈ విమర్శలు చేశారు. అన్ని పార్టీల కోరిక మేరకే కేంద్రం ఈ బిల్లు తెచ్చిందన్నారు.

‘లోక్‌సభలో ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. కానీ రాజ్యసభలో విపక్షపార్టీలు ఈ బిల్లుకు ఎందుకు అడ్డుపడుతున్నాయో అర్థం కావటం లేదు. వెనుకబడిన తరగతుల హక్కులను అడ్డుకునే వ్యతిరేక రాజకీయాలు చూసి చింతిస్తున్నాం’ అని మోదీ అన్నారు. బీజేపీ ఓబీసీ ఎంపీలు.. ఇతర పార్టీల్లోని ఓబీసీ రాజ్యసభ ఎంపీలను కలిసి వారిని ఒప్పించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement