పార్లమెంటు సమాచారం... | Parliament information | Sakshi
Sakshi News home page

పార్లమెంటు సమాచారం...

Mar 10 2016 1:00 AM | Updated on Mar 9 2019 3:08 PM

దేశ శత్రువుల (పాక్, చైనా జాతీయుల పేరిట ఉన్న) ఆస్తులను కేంద్ర ప్రభుత్వ సంరక్షణలో కొనసాగించేందుకు ఉద్దేశించిన శత్రువుల ఆస్తి చట్ట సవరణ బిల్లు-2016ను లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.

శత్రువుల ఆస్తుల బిల్లుకు ఓకే: దేశ శత్రువుల (పాక్, చైనా జాతీయుల పేరిట ఉన్న) ఆస్తులను కేంద్ర ప్రభుత్వ సంరక్షణలో కొనసాగించేందుకు ఉద్దేశించిన శత్రువుల ఆస్తి చట్ట సవరణ బిల్లు-2016ను లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.  
 ఫిర్యాదులకు ఆధార్ స్వచ్ఛందం: ప్రభుత్వ సంబంధ విషయాలపై ఆన్‌లైన్‌లో చేసే ఫిర్యాదులకు ఆధార్ నంబర్‌ను కచ్చితంగా కాకుండా స్వచ్ఛందంగా తెలిపే విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది.  ఏ ప్రభుత్వ విభాగంపైనైనా www.pgportal.gov.inకు ఫిర్యాదు చేయొచ్చు.
 చిన్న సంస్థలకూ ఈపీఎఫ్: 10 మంది కంటే ఎక్కువగా ఉన్న చిన్న ప్రైవేట్ సంస్థలనూ ఉద్యోగ భవిష్యనిధి(ఈపీఎఫ్) పరిధిలోకి తేవాలని  భావిస్తున్నట్లు  కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు.  
 ఎంపీలాడ్స్ నిధుల పెంపు యోచన: ఎంపీల నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకుఇచ్చే ఎంపీలాడ్స్ నిధులను పెంచే ప్రతిపాదన ఆర్థిక శాఖ పరిశీలనలో ఉందని ప్రభుత్వం లోక్‌సభకు చెప్పింది.
 నేడు ఇషత్ ్రకేసుపై చర్చ: ఇష్రాత్‌జహాన్ ఎన్‌కౌంటర్ కేసు అఫిడవిట్ల వివాదంపై గురువారం లోక్‌సభ చర్చించే అవకాశముంది. సావధాన తీర్మానంపై  హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ బదులిస్తారు.
 నేడే రియల్ ఎస్టేట్ బిల్లు:  రియల్ ఎస్టేట్ బిల్లును గురువారం రాజ్యసభ ఎజెండాలో చేర్చారు. నోటీసులిస్తున్నా బిల్లు ఎజెండాలోకి ఎందుకు రావడం లేదని మంత్రి వెంకయ్య  ప్రశ్నించగా, గురువారం చర్చకు అనుమతిస్తామని డిప్యూటీ చైర్మన్ కురియన్‌చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement