సంబంధాల పునరుద్ధరణకు పాక్ అడుగులు | Pak hands over 173 prisoners to India | Sakshi
Sakshi News home page

సంబంధాల పునరుద్ధరణకు పాక్ అడుగులు

Feb 16 2015 9:07 PM | Updated on Sep 2 2017 9:26 PM

భారత్తో సంబంధాలను పునరుద్ధరించుకునే దిశగా పాకిస్తాన్ అడులుగు వేస్తోంది.

లాహోర్: భారత్తో సంబంధాలను పునరుద్ధరించుకునే దిశగా పాకిస్తాన్ అడులుగు వేస్తోంది. పాకిస్తాన్ జైళ్లలో ఖైదీలుగా ఉన్న 173 మంది భారతీయులను  పాక్ సోమవారం భారత అధికారులకు అప్పగించింది. కరాచి జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 172 మంది భారత జాలర్లతోపాటు మరో ఖైదీని పాక్ ఆదివారం విడుదల చేసింది. వాఘా సరిహద్దు వద్ద భారత అధికారులకు వారిని అప్పగించారు. అరేబియా సముద్రంలోని తమ జలాల్లోకి ప్రవేశించారని వారిని అరెస్టు చేశారు. శిక్ష ముగిసిన తరువాత వారిని విడుదల చేశారు.

ఇరుదేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించుకోవాలని భారత, పాక్ ప్రధానులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్‌లు ఇటీవల నిర్ణయించిన నేపథ్యంలో వీరిని విడుదలచేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రెండు దేశాల్లో ఉన్న ఇరుదేశాల ఖైదీల సమస్యను పాక్ మానవతా దక్పథంతో చూస్తుందని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది.

Advertisement
 
Advertisement
Advertisement