‘పెట్రో షాకులు తప్పవు’

‘పెట్రో షాకులు తప్పవు’ - Sakshi

సాక్షి,న్యూఢిల్లీః పెట్రోల్‌ ధర పెంపు నుంచి ప్రజలకు ఇప్పట్లో ఊరట లభించేలా లేదు. ఇంధన ధరల భారం నుంచి ఉపశమనం కలిగించేందుకు పెట్రో ఉత్పత్తులపై సుంకాలను తగ్గించే ఆలోచన లేదని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ స్పష్టం చేశారు. అమెరికాలో హరికేన్‌ ప్రభావంతో డిమాండ్‌, సరఫరాల మధ్య అంతరం పెరిగి పెట్రో ధరల్లో పెరుగుదల చోటుచేసుకుందని, ఇది తాత్కాలికమేనని జైట్లీ పేర్కొన్నారు. పెట్రో ఉత్పత్తులపై సుంకాలు తగ్గించబోమని, సంక్షేమ పథకాల అమలుకు, వృద్థి రేటుకు ప్రభుత్వం నిధులు వెచ్చించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

 

ధరల పెరుగుదలపై విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు. వర్షాకాలంలో కూరగాయల ధరలు పెరగడం సహజమేనన్నారు. ద్రవోల్బణం ఇప్పటికీ కేవలం 3.36 శాతంగానే ఉందన్నారు. 
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top