పఠాన్కోట్ ఎయిర్బేస్లో ప్రధాని మోదీ | narendra modi visits Pathankot | Sakshi
Sakshi News home page

పఠాన్కోట్ ఎయిర్బేస్లో ప్రధాని మోదీ

Jan 9 2016 11:47 AM | Updated on Aug 15 2018 2:20 PM

పఠాన్కోట్ ఎయిర్బేస్లో ప్రధాని మోదీ - Sakshi

పఠాన్కోట్ ఎయిర్బేస్లో ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్బేస్ను సందర్శించారు.

పఠాన్కోట్: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్బేస్ను సందర్శించారు. శనివారం ఉదయం ఢిల్లీ నుంచి బయల్దేరిన మోదీ పఠాన్కోట్ చేరుకున్నారు. ఇటీవల ఎయిర్బేస్పై జరిగిన ఉగ్రవాద దాడి ఘటనను ఆర్మీ, ఉన్నతాధికారులు.. మోదీకి వివరించారు. ఎయిర్బేస్ను మోదీ పరిశీలించారు.

ఇటీవల పఠాన్ కోట్ ఎయిర్ బేస్పై దాడి చేసిన ఆరుగురు ఉగ్రవాదులను భద్రత బలగాలు హతమార్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ దాడిలో ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
 

Advertisement
 
Advertisement
Advertisement