ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. మావోయిస్టు మృతి
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లో సుక్మా జిల్లాలోని చింతగుఫా పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం కోబ్రా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. హోరాహోరీగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు హతమయ్యాడు. మావోయిస్టు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.