అగ్గి పుల్లలతో రథం తయారీ | Manufacture Of Radham With Match Sticks | Sakshi
Sakshi News home page

అగ్గి పుల్లలతో రథం తయారీ

Jul 14 2018 12:50 PM | Updated on Jul 14 2018 12:50 PM

Manufacture Of Radham With Match Sticks - Sakshi

బుల్లి రథం తయారీలో ఈశ్వర రావు    

భువనేశ్వర్‌/ఖుర్దారోడ్‌ : స్వామి పట్ల భక్తి శ్రద్ధల్ని ఒక్కొక్కరు ఒక్కో రీతిలో ప్రదర్శిస్తున్నారు. జగన్నాథుని రథయాత్ర అంటే విశ్వ వ్యాప్త భక్తులందరికీ పండగే. ఈ పంథాలో ఖుర్దారోడ్‌ గోపీనాథ్‌పూర్‌ ప్రాంతంలో ఉంటున్న లింగాల ఈశ్వర రావు అగ్గి పుల్లలతో చూడ చక్కని రథాన్ని ఆవిష్కరించాడు. ఆ రథానికి తగినంత పరిమాణంలో కనులకు ఆకట్టుకునే జగన్నాథుని విగ్రహం కూడా అగ్గి పుల్లలతోనే తయారు చేసి అమర్చాడు.

మహరణ సేవకులు నిర్మించే రథాల తరహాలో ఈ అగ్గి పుల్లల రథానికి సమ పరిమాణంలో చక్రాల్ని కూడా అమర్చాడు. దీంతో ఈ బుల్లి అగ్గి పుల్లల రథం చకచకా అటు ఇటు తిరుగుతోంది. ఈ రథం ఎత్తు 4.5 అంగుళాలు కాగా విగ్రహం 0.5 అంగుళాలు ఎత్తు ఉందని ఆవిష్కర్త పేర్కొన్నాడు. ఈ బుల్లి రథం, విగ్రహం తయారీలో మొత్తం 387 అగ్గి పుల్లలను వినియోగించాడు. రథం, విగ్రహాన్ని ఫ్యాబ్రిక్‌ రంగులతో చిత్రీకరించాడు. ఈశ్వరరావు కళకు అబ్బురపడిన స్థానికులు అభినందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement