పోలీసుల తీరుపై నెటిజన్ల ఆగ్రహం | Man left bleeding on road for half hour: Thiruvananthapuram cops say they were helpless | Sakshi
Sakshi News home page

పోలీసుల తీరుపై నెటిజన్ల ఆగ్రహం

Published Mon, Jan 18 2016 3:56 PM | Last Updated on Wed, Apr 3 2019 4:08 PM

పోలీసుల తీరుపై నెటిజన్ల ఆగ్రహం - Sakshi

పోలీసుల తీరుపై నెటిజన్ల ఆగ్రహం

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని అలానే అరగంటపాటూ వదిలేసి అతని మరణానికి కారణమైన పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తిరువనంతపురం(కేరళ):
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని అలానే అరగంటపాటూ వదిలేసి అతని మరణానికి కారణమైన పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తిరువనంతపురంలోని ఈస్ట్ ఫోర్ట్ సమీపంలో ఆదివారం విక్రం సారాబాయ్ స్పేస్ సెంటర్కు చెందిన వాహనం ఓ వృద్ధున్ని ఢీకొట్టింది. అక్కడే ఉన్న పోలీసులు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వృద్ధున్ని అరగంట పాటూ ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించలేదు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న అతన్ని అలానే వదిలేసి అంబులెన్స్ వచ్చే వరకు పోలీసులు వేచి చూశారు. దీంతో తీవ్రరక్తస్రావం జరిగి ఆ వ్యక్తి మృతి చెందాడు. జరిగిన సంఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టడంతో పోలీసుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.

అయితే ఆ వ్యక్తికి తీవ్రగాయాలవ్వడంతో స్ట్రెచర్ లేకుండా తీసుకు వెళ్లడం ఆ వ్యక్తి ప్రాణానికే ప్రమాదం అని భావించామని పోలీసులు చెబుతున్నారు. అందుకే అంబులెన్స్ వచ్చే వరకు ఆగాల్సి వచ్చిందన్నారు. అతని కాలు దాదాపు శరీరం నుంచి విడిపోయిందని అందుకే పోలీసు జీపులో తీసుకు వెళ్లలేకపోయామన్నారు.  ఆయితే ఆ వృద్ధునికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. అతను కేరళకు చెందిన వ్యక్తి కాదని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం అతని మృతదేహాన్ని తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఉంచారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement