బీజాపూర్‌లో పేలిన మందుపాతర | landmine blast in bijapur | Sakshi
Sakshi News home page

బీజాపూర్‌లో పేలిన మందుపాతర

Jan 12 2017 1:55 PM | Updated on Sep 5 2017 1:06 AM

మావోయిస్టులు అమర్చిన మందు పాతర పేలిన ఘటనలో ఓ జవానుకు తీవ్ర గాయాలయ్యాయి.

ఛత్తీస్‌గఢ్‌: మావోయిస్టులు అమర్చిన మందు పాతర పేలిన ఘటనలో ఓ జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లా మహదేవ్‌ ఘాట్‌ వద్ద గురువారం మందుపాతర పేలింది. దీంతో సమీపంలో ఉన్న సీఆర్పీఎఫ్‌ 85 వ బెటాలియన్‌కు చెందిన సురేంద్రకుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు మందుపాతర అమర్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement