ఊరిని మార్చిన చిన్నారి | Kid changed the village | Sakshi
Sakshi News home page

ఊరిని మార్చిన చిన్నారి

May 30 2016 1:56 AM | Updated on Sep 4 2017 1:12 AM

ఆర్తి రావ్టే.. ఈ పదకొండేళ్ల బాలిక తన ఊరినే ఆదర్శవంతంగా తీర్చిదిద్దింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాజనందగాం జిల్లా దోబ్ని గ్రామాన్ని ఆరుబయట మలమూత్ర

రాయ్‌పూర్: ఆర్తి రావ్టే.. ఈ పదకొండేళ్ల బాలిక తన ఊరినే ఆదర్శవంతంగా తీర్చిదిద్దింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాజనందగాం జిల్లా దోబ్ని గ్రామాన్ని ఆరుబయట మలమూత్ర విసర్జన చేయని గ్రామాల జాబితాలో చేర్చింది. గ్రామంలో రెండేళ్ల కిందటే ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించినా, వాటిని ప్రజలు ఉపయోగించే వారు కారు. దీంతో ఆర్తి ఉదయం నాలుగింటికే లేచి ఆరుబయట మలమూత్ర విసర్జన చేయకుండా తన సహవిద్యార్థులతో కలిసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది. కొన్ని రోజుల తర్వాత గ్రామ ప్రజలు ఇంటిలోని మరుగుదొడ్లు వినియోగించడంతో ఊరి పరిసరాలే మారిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement