సుప్రీంలో జయకు ఊరట | Jayalalitha's DA case: SC gives split verdict prosecutor | Sakshi
Sakshi News home page

సుప్రీంలో జయకు ఊరట

Apr 18 2015 2:04 AM | Updated on Sep 2 2018 5:18 PM

సుప్రీంలో జయకు ఊరట - Sakshi

సుప్రీంలో జయకు ఊరట

సుప్రీంకోర్టులో తమిళనాడు మాజీ సీఎం జయలలితకు ఊరట లభించింది.

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో తమిళనాడు మాజీ సీఎం జయలలితకు ఊరట లభించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె బెయిల్‌ను కోర్టు మే 12 వరకు పొడిగించింది. కేసులో జయ అప్పీలుపై కర్ణాటక హైకోర్టు తీర్పు వెలువరించే వరకు ఈ బెయిల్‌ను పొడిగిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు, జస్టిస్ ఏకే మిశ్రాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం పేర్కొంది.

జయ అప్పీలుపై తీర్పు వెలువరించే గడువును ఈనెల 18 నుంచి మే 12కు పొడిగించేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఈ కేసును విచారిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి చేసిన అభ్యర్థనను కూడా కోర్టు  అనుమతించింది. ఆయన తరఫున కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రార్ దరఖాస్తు దాఖలు చేశారు. భవిష్యత్తులో అవసరమైతే మరింత గడువు కోరుతూ దరఖాస్తు చేసుకునేందుకు కూడా ధర్మాసనం అనుమతించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement