జవాన్లను బలిగొన్న కొండచరియలు | jawans killed as avalanche hits check-post | Sakshi
Sakshi News home page

జవాన్లను బలిగొన్న కొండచరియలు

Mar 3 2015 12:09 PM | Updated on Sep 2 2017 10:14 PM

ఇద్దరు వీర జవాన్లను కొండచరియల రూపంలో మృత్యువు కభళించింది.

ఇద్దరు వీర జవాన్లను కొండచరియల రూపంలో  మృత్యువు కభళించింది. వారు కాపలాగా ఉన్న చెక్పోస్ట్పై భారీ కొండ చరియలు విరిగిపడి ఇద్దరు సైనికులు అక్కడికక్కడే చనిపోగా మరో సైనికుడి ఆచూకీ తెలియడం లేదు. ఈ ఘటన ఉత్తరాఖండ్లోని పితోర్గడ్ జిల్లాలోని సిలక్ సరిహద్దు ప్రాంతంలో చోటుచేసుకుంది. మొత్తం ఎనిమిది మంది ఈ చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వర్తిస్తుండగా వారిలో ఐదుగురు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఉత్తరాఖండ్లో గత రెండు రోజులుగా మంచుతో కూడిన వర్షం పడుతున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement