సత్యార్థికి ముందు ఆరుగురు భారతీయులు ఈ అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించారు.
నోబెల్ బహుమతి అందుకున్న ఏడో భారతీయుడిగా కైలాస్ సత్యార్థి నిలిచారు. పాకిస్థాన్ బాలిక మలాలా యూసఫ్జాయ్తో పాటు సత్యార్థికి శాంతి నోబెల్ బహుమతిని ప్రకటించారు. సత్యార్థికి ముందు ఆరుగురు భారతీయులు ఈ అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించారు. వారి వివరాలు..
నోబెల్ పొందిన భారతీయులు:
రవీంద్ర నాథ్ ఠాగూర్ -సాహిత్యం 1913
సీవీ రామన్-భౌతిక శాస్త్రం 1930
హర్గోవింద్ ఖురానా-వైద్యం 1968
మదర్ థెరిసా-శాంతి బహుమతి 1979
సుబ్రమణ్యం చంద్రశేఖర్- భౌతికశాస్త్రం 1983
అమర్థ్యసేన్-ఆర్థికశాస్త్రం 1998
కైలాస్ సత్యార్థి- శాంతి 2014
భారత సంతతికి చెందిన వారు, భారత్లో జన్మించి విదేశాలకు వెళ్లిన మరికొందరు ప్రముఖులు కూడా నోబెల్ బహుమతి అందుకున్నారు.