భారత్‌–అమెరికా 2+2 చర్చలు వాయిదా | Inaugural India-US '2+2' dialogue postponed | Sakshi
Sakshi News home page

భారత్‌–అమెరికా 2+2 చర్చలు వాయిదా

Jun 28 2018 4:24 AM | Updated on Aug 21 2018 9:33 PM

Inaugural India-US '2+2' dialogue postponed - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌–అమెరికా విదేశాంగ, రక్షణ మంత్రుల మధ్య జూలై 6న జరగాల్సిన 2+2 చర్చలు వాయిదా పడ్డాయి. కొన్ని అనివార్య కారణాలతో ఈ చర్చలు వాయిదా పడినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ప్రకటించారు. ఈ విషయమై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ఫోన్‌చేసిన ఆయన విచారం వ్యక్తం చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన సుష్మా  ఇరుదేశాలకు ఆమోదయోగ్యమైన మరో తేదీన అమెరికా లేదా భారత్‌లో సమావేశమయ్యేందుకు అంగీకరించారు. 2017లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక, భద్రత, రక్షణ రంగాల్లో సహకారం పెంపొందించుకోవడంలో భాగంగా 2+2 చర్చలు జరిపేందుకు భారత్, అమెరికాలు అంగీకరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement