హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లాలో బుధవారం ఉదయుం ఓ బస్సు గోవింద్సాగర్ రిజర్వాయర్లో పడిపోవడంతో 25 మంది
	షిమ్లా: హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లాలో బుధవారం ఉదయుం ఓ బస్సు గోవింద్సాగర్ రిజర్వాయర్లో పడిపోవడంతో 25 మంది ప్రయాణికులు వుృతిచెందారు. ఈ సంఘటనలో 15  మంది గాయుపడగా పలువురు గల్లంతయ్యూరని బిలాస్పూర్ డిప్యూటీ కమిషనర్ అజయ్శర్మ తెలిపారు. గాయుపడినవారిని బిలాస్పూర్ ఆస్పత్రిలో చేర్పించారు.
	
	గల్లంతైనవారికోసం తీవ్రంగా గాలిస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రైవేటు సంస్థకు చెందిన 40 సీట్ల సామర్థ్యమున్న ఈ బస్సులో పరిమితికి మించి ప్రయూణికులు ఎక్కారని, ఇంకా కొందరు బస్సు టాప్పైన కూడా ఎక్కారని తెలుస్తోంది. వుృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదముందని అధికారులు తెలిపారు. ఈ బస్సు రిషికేశ్ నుంచి బిలాస్పూర్కు వెళుతుండగా ప్రమాదానికి గురైందని వారు చెప్పారు.  
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
