న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో శనివారం జరిగిన తొలి విడత పోలింగ్పై నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రచురించిన దేశంలోని అతి పెద్ద హిందీ పత్రిక ‘దైనిక్ జాగరన్’పై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే. ఎగ్జిట్ పోల్ ఫలితాలు మిగతా విడతల పోలింగ్పై నిజంగా ప్రభావం చూపిస్తాయా? చూపిస్తే ఏ మేరకు ప్రభావం ఉంటుంది? అసలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమవుతాయా? నిజమయ్యేది ఉంటే గతంలో పలు పత్రికలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు పరస్పరం విరుద్ధంగా ఎందుకున్నాయి? ఎగ్జిట్ పోల్ ఫలితాలను నిషేధించడం సమంజసమేనా?
పలు విడుతలుగా జరిగే ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్పై నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రెండు విధాలుగా ప్రభావం చూపిస్తాయని ఎన్నికలు కమిషన్ మొదటి నుంచి వాదిస్తూ వస్తోంది. ఎన్నికల గాలి ఎటువైపు వీస్తున్నదో తెలిసి ఓటరు తన ఓటు వృధా కాకూడదన్న ఉద్దేశంతో గెలిచే పార్టీవైపు మొగ్గుచూపుతారన్నది ఒక కారణం కాగా, ఓడిపోయే పరిస్థితి ఉందనుకున్న రాజకీయ పార్టీలు గెలుపుకోసం చివరి నిమిషంలో ఓటర్లను అన్ని రకాలుగా ప్రలోభాలకు గురిచేసే ప్రమాదం ఉందన్నది రెండో కారణం. ఈ కారణాలతోనే 2008లో ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సవరణలు తీసుకరావడం ద్వారా ఎన్నికల ముగియకుండానే ఎగ్జిట్ పోల్స్ను నిర్వహించ కూడదని, వాటి ఫలితాలను ప్రచురించరాదంటూ నిషేధం తీసుకొచ్చారు.
ఎగ్జిట్ పోల్స్ ప్రచురణపై నిషేధం విధించడమంటే ప్రజల భావ ప్రకటన స్వాతంత్య్రాన్ని హరించడమేనని మొదటి నుంచి మీడియా ఆరోపిస్తోంది. తమ రాజకీయ అనుబంధాన్ని బట్టి మీడియా కూడా తప్పుడు ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించవచ్చని, ఓటరు కూడా తప్పుదోవ పట్టించేందుకు ఒక పార్టీకి ఓటేసి, మరో పార్టీకి ఓటేసునట్లు చెప్పవచ్చని అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తం మవుతున్నాయి. ఇందులో ఏదీ జరిగినా తదుపరి విడత పోలింగ్ల్లో పాల్గొనే ఓటరుపై ప్రభావం ఉంటుందని మాజీ ఎన్నికల కమిషనర్ ఖురేషి ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. ఎగ్జిట్ పోల్స్ ప్రభావం అందరిపైన ఉండదని, అనిశ్చితంగా ఉండే ఓటరుపైనే ఉంటుందని వాదిస్తున్న వారు లేకపోలేదు.
ఓపీనియన్ పోల్స్లో యూపీ ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయలకు భిన్నంగా దైనిక్ జాగరన్ పత్రిక వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఉన్నాయి. అంటే తన రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆ పత్రిక తర్వాత విడతల ఓటర్లను ప్రభావితం చేయడం కోసం ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూపించి ఉండాలి. లేదా అండర్ కరంట్గా ఓ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాలనుకుంటున్న ఓటర్లు ఎగ్జిట్ పోల్స్నే తప్పుదారి పట్టించి ఉండాలి. చివరకు ఏ ఫలితమొచ్చినా అది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఇచ్చే తీర్పే అవుతుంది.
ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా?
Published Mon, Feb 13 2017 8:27 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
అమిత్షాపై కోడ్ ఉల్లంఘన కేసు
మళ్ళీ వచ్చారు...మౌత్ టాక్ మల్లిగాళ్ళు
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement