డాక్టర్‌ కిడ్నాప్‌: రూ. 55 లక్షల డిమాండ్‌ | Etawah doctor kidnapped, Rs 55 lakh demanded as ransom: Police | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ కిడ్నాప్‌: రూ. 55 లక్షల డిమాండ్‌

Sep 15 2017 2:33 PM | Updated on Sep 19 2017 4:36 PM

యూపీలో ఓ వైద్యుడి కిడ్నాప్‌ కలకలం సృష్టిస్తోంది.

ఉత్తరప్రదేశ్‌: యూపీలో ఓ వైద్యుడి కిడ్నాప్‌ కలకలం సృష్టిస్తోంది. ఈటావా పట్టణానికి చెందిన డాక్టర్‌ జ్ఞాన్‌ ప్రకాశ్‌ పాండేను కిడ్నాప్‌ చేసిన దుండగులు రూ. 55 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. గురువారం విధులకు వెళ్లిన జ్ఞాన్‌ ప్రకాశ్‌ పాండే తిరిగి రాకపోవడంతో కంగారు పడిన అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్‌ చేసి రూ. 55 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీని పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా అగంతకులను పట్టుకోవడానికి యత్నిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement