
రాజ్యసభ ఎన్నికల సందడి షురూ
ఐదు రాష్ట్రాల ఎన్నికల సందడి ఇంకా పూర్తికాక ముందే రాజ్యసభ ఎన్నికలకు నగారా మోగింది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల సందడి ఇంకా పూర్తికాక ముందే రాజ్యసభ ఎన్నికలకు నగారా మోగింది. 15 రాష్ట్రాలలో 57 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు జారీచేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 4, తెలంగాణ నుంచి 2 స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి.
2016 జూన్- ఆగస్టు మధ్య పదవీకాలం ముగిసే ఎంపీల ఖాళీలను భర్తీ చేయడానికి ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏపీ నుంచి నిర్మలా సీతారామన్, జేడీ శీలం, జైరాం రమేష్, సుజనా చౌదరిల పదవీ కాలం ముగుస్తుండగా, తెలంగాణ నుంచి వి.హనుమంతరావు, గుండు సుధారాణిల పదవీ కాలం ముగుస్తోంది. దీంతో మొత్తం 57 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించింది.
ముఖ్యమైన తేదీలు ఇలా ఉన్నాయి...
నోటిఫికేషన్ జారీ: మే 24
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: మే 31
నామినేషన్ల పరిశీలన: జూన్ 1
నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ: జూన్ 3
ఎన్నిక తేదీ: జూన్ 11 ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు
ఓట్ల లెక్కింపు: జూన్ 11
ఎన్నికల ప్రక్రియ ముగింపుతేదీ: జూన్ 13