రోజూవారీ ప్రచార వ్యయం కుదింపు | Election Commission Of India Revises Cash Expenditure Limit | Sakshi
Sakshi News home page

Nov 26 2018 10:24 AM | Updated on Nov 26 2018 10:24 AM

Election Commission Of India Revises Cash Expenditure Limit - Sakshi

న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో మితిమీరిన నగదు ప్రవాహాన్ని అడ్డుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం చర్యలకు దిగింది. ప్రచారం నిమిత్తం అభ్యర్థి రోజుకు జరిపే నగదు లావాదేవీలను రూ.20 వేల నుంచి రూ.10 వేలకు తగ్గించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) నుంచి అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. రూ.10 వేల పరిమితి దాటి కూడా ఖర్చు చేయాల్సి వస్తే, ఆ లావాదేవీలను అభ్యర్థి ఖాతా నుంచి చెక్కులు, డ్రాఫ్టులు, నెఫ్ట్‌/ఆర్‌టీజీఎస్‌ రూపంలో నిర్వహించాలని ఈసీ సూచించింది.

నవంబర్‌ 12నే అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధన ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ ఎన్నికలపై ప్రభావం చూపనుంది. ప్రచార సమయంలో అభ్యర్థి ఎవరైనా వ్యక్తి, సంస్థ నుంచి నగదు రూపంలో రూ.10 వేలకు మించి విరాళాలు, రుణాలు స్వీకరించరాదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement