భారత్‌లో 6 లక్షలు దాటిన కరోనా కేసులు | Coronavirus Cases Reached To 6lakhs In India | Sakshi
Sakshi News home page

భారత్‌లో 6 లక్షలు దాటిన కరోనా కేసులు

Jul 2 2020 10:14 AM | Updated on Jul 2 2020 12:48 PM

Coronavirus Cases Reached To 6lakhs In India - Sakshi

భారత్‌లో కరోనా వైరస్‌ రోజురోజుకు మరింత విజృంభిస్తోంది.

ఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ రోజురోజుకు మరింత విజృంభిస్తోంది. భారత్‌లో 24 గంటల్లో 19,148 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 6,04,641కి చేరింది. కాగా కరోనాతో 24 గంటల్లో 434 మంది మృతి చెందగా దేశంలో మొత్తం మరణాల సంఖ్య 17,834కు చేరుకుంది. ఇప్పటివరకు కరోనా నుంచి పూర్తిగా కోలుకొన్న వారి సంఖ్య 3,59,859గా ఉంది. ప్రస్తుతం దేశంలో 2,26,947 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు ముందువరుసలో ఉన్నాయి. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి దేశంలో లాక్‌డౌన్‌ విధించి నేటితో వంద రోజులు పూర్తయ్యింది. సరిగ్గా ఇదే రోజు దేశంలో కరోనా కేసులు ఆరు లక్షల మార్కును దాటాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో మూడో స్థానంలో ఉన్న రష్యా కంటే భారత్‌ కేవలం 50 వేల కేసుల దూరంలో నిలిచింది. 26 లక్షల కేసులతో అమెరికా, 14 లక్షల కేసులతో బ్రెజిల్‌ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement