కాంగ్రెస్ వాకౌట్ | congress walk out from loksabha | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ వాకౌట్

Mar 2 2015 1:03 PM | Updated on Mar 18 2019 9:02 PM

ముఫ్తీ వ్యాఖ్యలు తమనే కాకుండా దేశంలోని ప్రజలందరినీ బాధపెట్టాయని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు.

ముఫ్తీ వ్యాఖ్యలు తమనే కాకుండా దేశంలోని ప్రజలందరినీ బాధపెట్టాయని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఎన్నికల కమిషన్తోపాటు పోలీసు బృందాలు, ఇతర అధికారులు ఎంతో కష్టపడి ఎన్నికలు నిర్వహిస్తే ఆ క్రెడిట్ పాక్ కట్టబెట్టారని, ఉగ్రవాదులకు ఇచ్చారని మండిపడ్డారు. సోమవారం ముఫ్తీ వ్యాఖ్యలపై ధుమారం రేగిన అనంతరం బీజేపీ బాధ్యతయుతమైన సమాధానం చెప్పలేదంటూ లోక్సభ నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలు వాకౌట్ చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ అంశంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేయగా రాజ్నాథ్ సింగ్ అందుకు కుదరదన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి కారణం అక్కడి ప్రజలే అని చెప్పారు. ప్రధానితో వివరణ ఇప్పించడం సాధ్యం కాదని చెప్పడంతో కాంగ్రెస్ ఎంపీలు వాకౌట్ చేశారు.


 

Advertisement
 
Advertisement
Advertisement