సాక్షి, ముంబై: రోడ్లపై ఏర్పడిన గుంతలు ఇబ్బంది కలిగిస్తే ప్రజలు ఆన్లైన్లోనూ ఫిర్యాదు చేసే సదుపాయాన్ని కొనసాగిస్తున్నట్టు మహానగర పాలక సంస్థ (బీఎంసీ) ప్రకటించింది. తమ దగ్గరున్న మొబైల్ లేదా కెమెరాతో తీసిన ఫొటోలను బీఎంసీ వెబ్సైట్లో పోస్టు చేస్తే చాలు. సమీపంలో ఉన్న సంబంధిత కాంట్రాక్టర్ ద్వారా వెంటనే ఆ గుంతను పూడ్చివేయిస్తామని కార్పొరేషన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలవల్ల నగర రహదారులన్నీ గుంతలమయమయ్యాయి.
ఇక నుంచి ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే వాటిని పూడ్చివేస్తామని బీఎంసీ ప్రకటించింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఉరుకులుపరుగులు తీసే ముంబైకర్లకు బీఎంసీ వార్డు కార్యాలయాలకు వెళ్లి ఫిర్యాదు చేసేంత సమయం ఉండదు. కాలిబాటన వెళుతుండగా రోడ్డుపై గుంత కనిపిస్తే దాని ఫొటో తీసి వెబ్సైట్లో పెడితే చాలని బీఎంసీ ముంబైకర్లకు సూచించింది. గత సంవత్సరం వర్షాకాలంలో ఏర్పడిన గుంతలు పూడ్చే పనులు పూర్తిచేసే సరికి ఈ ఏడాది జూన్ వచ్చింది. ఈసారి వర్షాలు ఆలస్యం కావడంతో కాట్రాక్టర్లకు కొంత సమయం లభించినట్లయింది. అయితే జూలై మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలు రోడ్లను గుంతలమయంగా మార్చాయి.
దీంతో వాహనదారులు నరకయాతన అనుభవించడమే గాక, ట్రాఫిక్కు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా గుంతలను పూడ్చివేయాలని బీఎంసీ కాంట్రాక్టర్లను ఆదేశించింది. రోడ్ల మరమ్మతులు,గుంతలు పూడ్చే పనులకు రూ.32 కోట్లు నిధులు మంజూరు చేసింది. బీఎంసీలో అధికారపక్షం శివసేన కూడా రోడ్ల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యమిస్తోంది. స్థాయీసంఘం అధ్యక్షుడు శైలేష్ ఫణసే ప్రతీరోజు రోడ్లపై గుంతలను పరిశీలిస్తున్నారు. గుంతలు కనిపిస్తే సంబంధిత వార్డు ఇంజనీర్ లేదా అదనపు కమిషనర్కు వివరాలు అందజేస్తారు. వాటిని పూడ్చిన తరువాత మళ్లీ అక్కడే గంతలు ఏర్పడితే, అదే కాంట్రాక్టర్ చేత పూడ్చివేయిస్తున్నామని ఫణసే ఈ సందర్భంగా వివరించారు.
గుంతలపై ఆన్లైన్లోనూ ఫిర్యాదు
Published Tue, Jul 15 2014 11:20 PM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement