చైనా ఎందుకు భయపడుతోంది? | china worried about agni missile that can reach beijing | Sakshi
Sakshi News home page

చైనా ఎందుకు భయపడుతోంది?

Dec 27 2016 9:14 AM | Updated on Sep 4 2017 11:44 PM

చైనా ఎందుకు భయపడుతోంది?

చైనా ఎందుకు భయపడుతోంది?

భారతతదేశం తన స్పెషల్ ఫోర్సెస్ కమాండ్ (ఎస్ఎఫ్‌సీ) బలగాలకు అగ్ని 5 క్షిపణిని అందిస్తోందన్న సమాచారం తెలిసి చైనా ఒకింత కలవరపడింది.

భారతతదేశం తన స్పెషల్ ఫోర్సెస్ కమాండ్ (ఎస్ఎఫ్‌సీ) బలగాలకు అగ్ని 5 క్షిపణిని అందిస్తోందన్న సమాచారం తెలిసి చైనా ఒకింత కలవరపడింది. ఎందుకంటే.. దానివల్ల మన దేశానికి చైనా కంటే ఒక అడుగు ఎక్కువ సానుకూలత లభిస్తుంది. అత్యంత శక్తిమంతమైన ఈ క్షిపణిని సోమవారం విజయవంతంగా పరీక్షించారు. దీన్ని ప్రయోగిస్తే నేరుగా బీజింగ్, యూరప్‌లో చాలా ప్రాంతాలను తుత్తునియలు చేయొచ్చు. 
 
5వేల కిలోమీటర్లకు పైగా దూరం పయనించడంతో పాటు 1500 కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లడం, అణ్వస్త్ర సామర్థ్యం కూడా కలిగి ఉండటంతో.. ఈ క్షిపణిని చూసి చాలా దేశాలు కనుబొమ్మలు ఎగరేశాయి. భూమ్మీద నుంచి భూ ఉపరితలం మీదకు ప్రయోగించగల ఈ క్షిపణిని నాలుగోసారి కూడా విజయవంతంగా పరీక్షించారు. 17 మీటర్ల పొడవుండి, 50 టన్నుల బరువుండే ఈ క్షిపణి నూటికి నూరుశాతం కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించింది. 
 
దీని మరికొన్ని లక్షణాలు చూద్దాం..
  • ఈ మిసైల్‌లో ఎంఐఆర్‌వి సామర్థ్యం ఉంది. అంటే, ఇది ఒకేసారి పలు రకాల వార్‌హెడ్లను మోసుకెళ్లి, వేర్వేరు లక్ష్యాలను ఛేదించగలదు. 
  • మూడు దశలు ఉండటంతో ఇది అగ్ని మిసైళ్లు అన్నింటిలోకీ చాలా అత్యాధునికమైనది. 
  • దీనివల్ల భారతదేశ దీర్ఘశ్రేణి దాడి సామర్థ్యం మరింత పెరుగుతుంది. 
  • దీని స్ట్రైక్ రేంజి సుమారు 5500 నుంచి 5800 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంటే, బీజింగ్ సహా చైనాలోని పలు ప్రధాన నగరాలను సులభంగా చేరుకోగలదు. 
  • 2012లో తొలిసారి అగ్ని 5ను పరీక్షించినప్పుడు.. దాని సామర్థ్యాన్ని భారత్ తక్కువ చేసి చూపిస్తోందని, వాస్తవానికి అది 8వేల కిలోమీటర్ల సామర్థ్యంతో యూరప్‌లో 70 శాతాన్ని చేరుకోగలదని చైనా అధికారిక మీడియా పేర్కొంది. 
  • అయితే భారతీయ నాయకులు నిజంగా ఆ క్షిపణిని ప్రయోగించగలరా అని కూడా కొందరు చైనా నిపుణులు ఆ సమయంలో అనుమానాలు వ్యక్తం చేశారు. 
  • ఇప్పుడు ఈ క్షిపణిని పూర్తిస్థాయిలో భారత సైన్యానికి అందుబాటులోకి తెస్తే, చైనా కంటే మన దేశానికి కొంత సానుకూలత పెరుగుతుంది. ఇప్పటివరకు ఈ విషయంలో మనం కొంత వెనకబడి ఉన్నాం. చైనా తమవద్ద ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైళ్లు ఉన్నాయని, అవి భారతదేశం మొత్తాన్ని చేరుకోగలవని ఇన్నాళ్లూ చెబుతూ వస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement