బస్సు ప్రమాదంలో బీజేపీ నేత మృతి | BJP leader killed, 12 injured in accident Firozabad | Sakshi
Sakshi News home page

బస్సు ప్రమాదంలో బీజేపీ నేత మృతి

Apr 30 2016 5:48 PM | Updated on Sep 3 2017 11:07 PM

బస్సు ప్రమాదంలో బీజేపీ నేత మృతి

బస్సు ప్రమాదంలో బీజేపీ నేత మృతి

వోల్వో బస్సును స్టేషనరీ ట్రక్కు ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా, 12 మంది గాయపడ్డారు.

ఫిరోజాబాద్(ఉత్తరప్రదేశ్): వోల్వో బస్సును స్టేషనరీ ట్రక్కు ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా, 12 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఫిరోజాబాద్లోని తండ్లా బ్రిడ్జిపై శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే హన్సరాజ్ వర్మ అక్కడిక్కడే మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. ఢిల్లీ నుంచి లక్నోకు బయల్దేరిన వోల్వో బస్సును తాండ్ల బ్రిడ్జిపై ఓ ట్రక్కు ఢీకొట్టినట్టు ఎస్ఎస్పీ అశోక్ కుమార్ శర్మ వెల్లడించారు.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బస్సు డ్రైవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. క్షతగాత్రులను స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. కాగా, మృతిచెందిన బీజేపీ నేత హన్సరాజ్.. గతంలో ఈత్ జిల్లా, నిదౌళ్లిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. అనంతరం ఆయన బీజేపీలో చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement