పోలీస్‌స్టేషన్‌పై ఆర్మీ జవాన్ల దాడి | Army soldiers attacked the police station, | Sakshi
Sakshi News home page

పోలీస్‌స్టేషన్‌పై ఆర్మీ జవాన్ల దాడి

Jan 15 2015 3:19 AM | Updated on Aug 21 2018 5:46 PM

మహారాష్ట్రలోని ఉపానగర్ పోలీస్‌స్టేషన్‌పై ఆర్మీ జవాన్లు బుధవారం విధ్వంసానికి పాల్పడ్డారు.

నాసిక్: మహారాష్ట్రలోని ఉపానగర్ పోలీస్‌స్టేషన్‌పై ఆర్మీ జవాన్లు బుధవారం విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్టేషన్ ఆవరణలో తమ వాహనాన్ని పార్కింగ్ చేసుకోవడానికి మంగళవారం రాత్రి పోలీసులు అనుమతించకపోడంతో దాదాపు 150 మంది జవాన్లు బుధవారం ఉదయం పోలీస్‌స్టేషన్‌పై దాడి చేశారు. అక్కడున్న మహిళా పోలీసుపై అసభ్యంగా ప్రవర్తించారు. అడ్డొచ్చిన పోలీసులందరినీ చితకబాదారు. ఈ ఘటనపై ఆర్మీ విచారణకు ఆదేశించింది. ఈ కేసులో ఆరుగురు జవాన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement