'48 గంటల్లో నివేదిక ఇవ్వండి' | aap governement asks panel submit report on delhi cricket body | Sakshi
Sakshi News home page

'48 గంటల్లో నివేదిక ఇవ్వండి'

Nov 12 2015 11:53 AM | Updated on Sep 3 2017 12:23 PM

ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ పై తలెత్తిన అవినీతి ఆరోపణల్లో నిగ్గు తేల్చేందుకు ఆమ్ ఆద్మీపార్టీ ప్రభుత్వం ఇద్దరు సభ్యులతో కూడిన ప్యానెల్ను నియమించింది.

న్యూఢిల్లీ: ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ పై తలెత్తిన అవినీతి ఆరోపణల్లో నిగ్గు తేల్చేందుకు ఆమ్ ఆద్మీపార్టీ ప్రభుత్వం ఇద్దరు సభ్యులతో కూడిన ప్యానెల్ను నియమించింది. 48 గంటల్లోగా తమకు నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఢిల్లీ క్రికెట్ బాడీలో పెద్ద మొత్తంలో అవినీతి చోటుచేసుకుందని, అవినీతికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని పలు సంఘాల నుంచి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌ గా తీసుకొని ప్యానెల్ వేసింది.

Advertisement
 
Advertisement
Advertisement