విజయనిర్మల సంతాప సభకు హాజరైన సినీ ప్రముఖులు

Vijaya Nirmala Prayer Meeting - Sakshi

ఇటీవల మరణించిన నటీ, దర్శకురాలు విజయనిర్మల సంతాప సభను హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి సంధ్యా కన్వెన్షన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయనిర్మల కుటుంబ సభ్యులు సూపర్‌ కృష్ణ, నరేష్‌తో పాటు నటులు, దర్శకులు, నిర్మాతలు ఇతర సాంకేతిక నిపుణులు పాల్గొని నివాళులర్పించారు. పలువురు రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయనిర్మలకు నివాళులర్పించారు.

విజయనిర్మల జూన్‌ 27న కాంటినెంటల్‌ హాస్పిటల్‌ చిక్సిల్ పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా తెలుగు సినీ రంగానికి ఎనలేని సేవలందించిన ఆమె మృతితో టాలీవుడ్ సినీ పరిశ్రమ షాక్‌కు గురైంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top