కాలం మారింది. ఒకప్పటితో పోలిస్తే... నటీమణుల్ని ఇప్పుడు కేవలం అందానికీ, అలంకరణకీ వాడే సామగ్రిలా చూస్తున్నారే తగిన గౌరవం ఇవ్వడం లేదు. ఈ మాట అందరూ అనుకొనేదే అయినా, గౌరవప్రదమైన నటి ఎవరైనా అంటే? అవును. నటి సుహాసిని నోట ఇప్పుడు ఈ మాటే వచ్చింది. ‘‘1980లలో పరిశ్రమలో నటిగా మంచి స్థానంలో ఉన్నందుకు గర్విస్తున్నా. నన్నడిగితే - ఆ సమయంలో సినిమాల్లో హీరోయిన్లుగా చేసిన నటి రాధిక, నేను, రేవతి, సరిత - ఇలా మేమందరం చాలా అదృష్టవంతులం.
అప్పట్లో మేము చేసినవన్నీ వ్యక్తిత్వమున్న బలమైన పాత్రలు’’ అని నటి - దర్శకురాలు సుహాసినీ మణిరత్నం ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు. అప్పటికీ, ఇప్పటికీ వచ్చిన మార్పుల గురించి ఆమె వ్యాఖ్యానిస్తూ, ‘‘దురదృష్టవశాత్తూ, ఇవాళ నటీమణుల్ని కేవలం అలంకరణ సామగ్రిలా వాడుతున్నారు. ఈ తరం హీరోయిన్లు అందగత్తెలే కాదు, అపారమైన ప్రతిభావంతులు. వాళ్ళకు ప్రపంచం గురించీ బాగా తెలుసు. కానీ, ఇప్పుడు స్త్రీ ప్రధాన పాత్రలు చాలా తక్కువగా వస్తున్నాయి’’ అని అన్నారు.
ఉత్తరాదితో పోలిస్తే, దక్షిణాదిలో పరిస్థితి మరీ బాగా లేదని సుహాసిని అభిప్రాయపడ్డారు. ‘‘మన కన్నా హిందీ చిత్రపరిశ్రమ కొంత మెరుగ్గా ఉంది. అక్కడ విద్యాబాలన్, కంగనా రనౌత్ లాంటివాళ్ళు బలమైన పాత్రలు పోషిస్తున్నారు. ఉత్తరాది లానే దక్షిణాది సినీపరిశ్రమలో కూడా ఎక్కువ భాగం పురుషాధిత్యమే. అయితే, రానురానూ అక్కడి కన్నా ఇక్కడ పరిస్థితి మరింత దిగజారుతోంది.
ఇప్పుడొస్తున్న అమ్మాయిలు కూడా బలమైన పాత్రలు చేసే కన్నా, సులభమైన మార్గాలు చూసుకుంటున్నారు’’ అని సుహాసిని అన్నారు. ‘‘పురుషాధిపత్యం ఎక్కువగా ఉండే ఈ పరిశ్రమలో కథానాయకుడికిచ్చే పారితోషికానికీ, కథానాయికకు ఇచ్చే డబ్బుకూ మధ్య కూడా చాలా తేడా ఉంది’’ అని ఆమె వాపోయారు. అయితే, 1980ల నాటి నటీనటులందరం ఇటీవల తరచూ కలుస్తూ, అభిప్రాయాలు కలబోసుకోవడం వల్ల చాలామంది పాత రోజుల్ని మళ్ళీ గుర్తు చేసుకోగలుగుతున్నామని ఆమె అన్నారు.
కమల్కు తగని సిగ్గు: ఇది ఇలా ఉండగా, బాబాయ్ కమలహాసన్ గురించి ఆమె ఓ ఆసక్తికరమైన అంశం బయటపెట్టారు. వెండితెర మీద చాలామంది హీరోయిన్లతో కలసి రొమాన్స్ను పండించే కమల్కు నిజానికి, ఆడవాళ్ళంటే తగని సిగ్గు అని సుహాసిని చెప్పారు. ‘‘మా ఇంటికి వచ్చే ఆడవాళ్ళను ఆయన ఎప్పుడూ కళ్ళలో కళ్ళు పెట్టి చూడరు, మాట్లాడరు. వాళ్ళను గౌరవంగా పలకరించి, ఆ వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోతారు’’ అని ఆమె చెప్పారు. మొత్తానికి, ఆడవాళ్ళ పట్ల గౌరవం విషయంలో సుహాసిని ఆవేదన అర్థం చేసుకోవాల్సిందే.
ఇవాళ అలంకరణకే హీరోయిన్లు!
Published Wed, Mar 2 2016 1:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement