
హీరోగా బాల నటుడు
మరో బాలనటుడు హీరోగా మారుతున్నాడు. కొన్నేళ్ళ క్రితం వచ్చిన ‘చూడాలని ఉంది’, ‘బాచి’, ‘ఇంద్ర’, ‘గంగోత్రి’ తదితర చిత్రాల్లో బాలనటునిగా అలరించిన తేజ సజ్జా
మరో బాలనటుడు హీరోగా మారుతున్నాడు. కొన్నేళ్ళ క్రితం వచ్చిన ‘చూడాలని ఉంది’, ‘బాచి’, ‘ఇంద్ర’, ‘గంగోత్రి’ తదితర చిత్రాల్లో బాలనటునిగా అలరించిన తేజ సజ్జా హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. ‘పంజా’, ‘అలియాస్ జానకి’ చిత్రాల నిర్మాత నీలిమ తిరుమలశెట్టి సంఘమిత్ర ఆర్ట్స్ పతాకంపై ప్రశాంత్వర్మను దర్శకునిగా పరిచయం చేస్తూ ఈ సినిమా నిర్మించనున్నారు. ప్రాచీథాకర్ నాయిక. నీలిమ మాట్లాడుతూ,‘‘పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమిది. అక్టోబర్లో చిత్రీకరణ మొదలుపెట్టి జనవరిలో విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: శ్రీకాంత్, కెమెరా: విష్ణు.