మూడు దశాబ్దాల కథ

కిశోర్కుమార్, యగ్నా శెట్టి జంటగా తమిళంలో రూపొందిన ఓ చిత్రం ‘రణరంగం’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఏఆర్ మూవీ ప్యారడైజ్ పతాకంపై ఎ. రామమూర్తి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఎ.రామమూర్తి మాట్లాడుతూ– ‘‘మూడు దశాబ్దాల కథతో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందింది.
దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. తమిళంలో ఘనవిజయం సాధించింది. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా ఇచ్చిన పాటలు ఓ హైలైట్. తమిళంలోలానే తెలుగులోనూ ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. శరణ్. కె. అద్వైతన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సులీలే కుమార్, మిధున్ కుమార్, రజినీ మహదేవయ్య, అజయ్ రత్నం, ధీరజ్ రత్నం తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి