నా కొక విజయం చాలా అవసరం అంటున్నారు నట, దర్శక, నిర్మాత పార్తీపన్. జయాపజయాలను పక్కన పెడితే పార్తీపన్లో మంచి నటుడే కాదు అంతకు మించి మంచి క్రేయేటర్ ఉన్నారు. సినిమా అంటే కాలక్షేప మాధ్యమమే కాదు ప్రజలను ఆలోచింప చేసే వారికి ఉపయోగపడే అంశాలుండాలని భావించే కళాకారుడు పార్తీపన్. అయితే ప్రేక్షకుల నాడిని తెలుసుకోవడం ఎవరికి సాధ్యం కాదు. అలాగని ప్రయత్నం చేయడం తప్పుకాదు. చిన్న గ్యాప్ తరువాత ‘కథై తిరైకథై వచనం ఇయక్కం’ అనే చిత్రంతో కొత్త రకం ప్రయోగం చేశారు. ఈ చిత్రం ఆగస్టు ఒకటిన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను దర్శకుడు పార్తీపన్ భావాలను తెలుసుకుందాం.
కథే లేకుండా చిత్రం తీయడం ప్రయోగమా?
దీన్ని ఒకయుక్తిగా భావించవచ్చు. పాటలు, మాటలు, హీరోహీరోయిన్లు లేకుండా చిత్రాలు వచ్చినట్లుగా కథే లేకుండా చిత్రం రూపొందిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకు రూపమే ఈ కథై తిరైకథై వచనం ఇయక్కం. చిత్రం తొలి భాగం సరదా సన్నివేశాలలో సాగుతుంది. రెండవ భాగం ముందు సన్నివేశాలకు కారణమేమిటన్న అంశాలు చోటు చేసుకుంటాయి. రెండవభాగం చూసేటప్పుడు ఒక కథ ఉందన్నది తెలుస్తుంది. ఈ అనుభవం ఖచ్చితంగా ప్రేక్షకులకు కొత్తగా ఉంటుంది.
చిత్రంలో చాలామంది స్టార్స్ ఉన్నారట!
వ్యాపారం కోసమే. అయితే నేను చేసే వ్యాపారం చిత్రంలో ఇంతమంది స్టార్స్ నటించారు. నా చిత్రంపై నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకంపై జరిగే వ్యాపారం ఇది. ఇందరు స్టార్స్ ఉంటే ఎంత న్యాయం జరుగుతుందో దాన్ని రాబట్టడం వ్యాపార లక్షణమేగా.
చిత్రం వెయిట్ పెంచుకుంటూ పోయినట్లున్నారు?
విజయమే గౌరవ మర్యాదలను నిర్ణయిస్తుంది. ఆ విధంగా నాకిప్పుడొక కమర్షియల్ విజయం చాలా అవసరం. అందుకే ఈ స్థాయి లో తీశాను. ఇందులో పదిమంది ప్రముఖతార లు నటించారు. ఈ రోజు జీవితాన్ని ఈ రోజే అనుభవించు అనే తత్వం పాట ఈ తరం జాతీ యగీతంగా ఈపాట ఉంటుంది.ఆ నటీనటులందరూ పాట వినే నటించడానికి అంగీకరించారు.
పెద్దరిస్క్ చేశారా?
నిజమే. అయితే తొలుత నేను ఆడియన్స్ను నమ్ముతాను. ఆ తరువాత నన్ను నేను నమ్ముతాను. నన్ను నమ్మిన నిర్మాత కె.చంద్రశేఖర్ కోసం నిజంగా శ్రమించాను. చిత్రం ఆరంభంలోనే నేనీ చిత్రంలో నటించకూడదు. నూత న తారలతోనే చిత్రం చేయాలని నిర్ణయించుకున్నాను. వేరే దారి లేక సీనియర్ నటుడు తంబిరామయ్యను ముఖ్యపాత్రలో నటింప చేశాను. మిగిలిన వారందరూ నూతన తారలే.
విజయం చాలా అవసరం
Published Sun, Jul 27 2014 11:35 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement