
మీనాక్షీదేవి
ఈ ఫొటో చూస్తుంటే శ్రీదేవి ఏదో గుడికి వెళ్లి ఉన్నట్లున్నారు అనిపిస్తోంది కదూ.
ఈ ఫొటో చూస్తుంటే శ్రీదేవి ఏదో గుడికి వెళ్లి ఉన్నట్లున్నారు అనిపిస్తోంది కదూ. సరిగ్గానే ఊహించారు. ఈ మాజీ అందాల నాయిక ముంబైలో ఉంటారు కాబట్టి, అడపా దడపా సిద్ధివినాయక టెంపుల్కి వెళుతుంటారు. ఈసారి మేడమ్కి మధుర మీనాక్షీదేవిని సందర్శించుకోవాలనిపించింది. ఈ పవిత్ర యాత్రకు స్నేహితులతో కలిసి వెళితే బాగుంటుంది కదా అని శ్రీదేవికి అనిపించింది. అంతే.. దాదాపు డజను మంది స్నేహితురాళ్లతో మధురై వెళ్లారు. తమిళ సంవత్సరాదిని పురస్కరించుకుని ఆమె ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. ‘‘సంవత్సరాది నాడు అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందం అనిపించింది’’ అంటూ అక్కడ దిగిన ఓ ఫొటోను షేర్ చేశారు శ్రీదేవి.