మీనాక్షీదేవి | sridevi trip to madurai meenakshi temple | Sakshi
Sakshi News home page

మీనాక్షీదేవి

Apr 16 2016 11:30 PM | Updated on Sep 3 2017 10:04 PM

మీనాక్షీదేవి

మీనాక్షీదేవి

ఈ ఫొటో చూస్తుంటే శ్రీదేవి ఏదో గుడికి వెళ్లి ఉన్నట్లున్నారు అనిపిస్తోంది కదూ.

ఈ ఫొటో చూస్తుంటే శ్రీదేవి ఏదో గుడికి వెళ్లి ఉన్నట్లున్నారు అనిపిస్తోంది కదూ. సరిగ్గానే ఊహించారు. ఈ మాజీ అందాల నాయిక ముంబైలో ఉంటారు కాబట్టి, అడపా దడపా సిద్ధివినాయక టెంపుల్‌కి వెళుతుంటారు. ఈసారి మేడమ్‌కి మధుర మీనాక్షీదేవిని సందర్శించుకోవాలనిపించింది. ఈ పవిత్ర యాత్రకు స్నేహితులతో కలిసి వెళితే బాగుంటుంది కదా అని శ్రీదేవికి అనిపించింది. అంతే.. దాదాపు డజను మంది స్నేహితురాళ్లతో మధురై వెళ్లారు. తమిళ సంవత్సరాదిని పురస్కరించుకుని ఆమె ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. ‘‘సంవత్సరాది నాడు అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందం అనిపించింది’’ అంటూ అక్కడ దిగిన ఓ ఫొటోను షేర్ చేశారు శ్రీదేవి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement