సీమాంధ్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు

Published Sat, Oct 25 2014 4:02 PM

seemandhra film chamber formed in tadepalli

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా సీమాంధ్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒకటి ఏర్పాటైంది. పలువురు నిర్మాతలు, దర్శకుల సహకారంతో ఈ ఛాంబర్ను ఏర్పాటుచేశామని ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ దిలీప్ రాజా తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈ ఛాంబర్ను శనివారం ఏర్పాటుచేశారు.

సినిమా పరిశ్రమలో వివాదాలు సహజమేనని ఈ సందర్భంగా దిలీప్ రాజా అన్నారు. విజయవాడలో సినిమా పరిశ్రమకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని, గుంటూరు - విజయవాడ మధ్య సీమాంధ్ర ఫిలిం ఛాంబర్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వానికి విన్నవిస్తామని ఆయన తెలిపారు.

Advertisement
Advertisement