
అందుకే శ్రీరామచంద్రను హీరోగా తీసుకున్నాం!
‘‘లక్ష్యానికి ప్రేమ అడ్డంకి కాకూడదు’ అనే గొప్ప పాయింట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం.
‘‘లక్ష్యానికి ప్రేమ అడ్డంకి కాకూడదు’ అనే గొప్ప పాయింట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. వినోదం ఇందులో మెండుగా ఉంటుంది’’ అని దర్శకుడు ఆర్వీ సుబ్రమణ్యం (సుబ్బు) చెప్పారు. ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్రను హీరోగా పరిచయం చేస్తూ ఆర్వీ సుబ్రమణ్యం దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ప్రేమ గీమా జాన్తా నయ్’. బార్బీ హండా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి మద్దాల భాస్కర్ నిర్మాత. నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఈవీవీగారి ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా చూశాక నాక్కూడా దర్శకత్వం వైపు ఆసక్తి మొదలైంది.
ఆ అభిలాషతోనే 1997లో హైదరాబాద్లో అడుగుపెట్టాను. తర్వాత కొన్ని ప్రముఖ పత్రికల్లో జర్నలిస్ట్గా పని చేశాను. తర్వాత పరశురామ్ దగ్గర సోలో, సారొచ్చారు చిత్రాలకు దర్శకత్వశాఖలో పనిచేశా. నేను తయారు చేసుకున్న కథ నచ్చి, నిర్మాత మద్దాల భాస్కర్ నన్ను దర్శకునిగా పరిచయం చేశారు’’ అని తెలిపారు. ‘‘లక్ష్యం కోసం ప్రేమను సైతం పక్కన పెట్టేస్తాడు ఇందులో కథానాయకుడు. జీవితంలో గెలిచాక, మళ్లీ తన ప్రేమను గెలిపించుకుని విజేతగా నిలుస్తాడు.
చాలా శక్తిమంతమైన పాత్ర ఇది. కథ రీత్యా ఈ పాత్రకు కొత్త ముఖం కావాలి. అది పాపులర్ ఫేస్ అయ్యుండాలి. అందుకే శ్రీరామచంద్రను తీసుకున్నాం. తను బాగా చేశాడు. తన కెరీర్కి ఈ సినిమా మంచి బ్రేక్ అవుతుంది. ధర్మవరపు సుబ్రమణ్యం ఆఖరి సినిమా ఇది. ఈ చిత్రాన్ని ఆయనకు అంకితమిస్తున్నాం’’ అని సుబ్బు చెప్పారు.