నటికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌..

police arrested actress shruthi for cheating prospective grooms - Sakshi

సాక్షి, టీనగర్‌: పెళ్లి పేరుతో నటి శృతి పలువురిని మోసం చేసిన విషయం తెలిసిందే. అందుకు ఆమెపై ఏడాదిపాటు నాన్‌బెయిలబుల్‌ గూండా చట్టాన్ని ప్రయోగించారు. ఆమె తల్లి చిత్ర, తండ్రి ప్రసన్న వెంకటేశ్‌లపై కూడా శనివారం కోయంబత్తూరు పోలీసులు గూండా చట్టం నమోదు చేశారు. 

ఆడిపోనాల్‌ ఆవని చిత్రంతో నటిగా గుర్తింపు పొందిన శృతి మోసం కేసులో చిక్కుకుంది. తీగ లాగితే డొంగ కదిలినట్లు ఆమె మోసాల చిట్టా బయటపడింది. అనేక మందిని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేయడం, వారి నుంచి అక్రమ వసూళ్లు చేసినట్లు విచారణలో తేలింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెకు సహకరించిన తల్లిదండ్రులను కటకటాల్లోకి పంపారు.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top