పుణ్యక్షేత్రాల సందర్శన | Nayantara spiritual visit to Himalayas | Sakshi
Sakshi News home page

పుణ్యక్షేత్రాల సందర్శన

Mar 19 2014 12:09 AM | Updated on Sep 2 2017 4:52 AM

పుణ్యక్షేత్రాల సందర్శన

పుణ్యక్షేత్రాల సందర్శన

నయనతారలో తాజాగా చాలా మార్పు కనిపిస్తోంది. దైవభక్తి తనలో బాగా పెరిగిందని ఆమె సన్నిహితులే చెబుతున్నారు. తెలుగు,

నయనతారలో తాజాగా చాలా మార్పు కనిపిస్తోంది. దైవభక్తి తనలో బాగా పెరిగిందని ఆమె సన్నిహితులే చెబుతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్న నయన, ఏ మాత్రం ఖాళీ దొరికినా పుణ్యక్షేత్రాల సందర్శనకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇటీవలే డెహ్రడూన్‌లో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆ షూటింగ్ పూర్తి కాగానే ఆ చుట్టు పక్కల ఉన్న పలు పుణ్యక్షేత్రాలకు వెళ్లారు. హరిద్వార్, రిషికేష్‌ల్లోని పలు దేవాలయాలను సందర్శించారు. లక్ష్మణ్ జూలా, సప్తర్షి ఆశ్రమం, నీలకంఠ మహాదేవ్, సప్త సరోవర్ తదితర ప్రదేశాలను కూడా వీక్షించి ఆమె ఒక తన్మయత్వానికి లోనయ్యారట.
 

Advertisement
 
Advertisement
Advertisement