‘మనుష్యులే పోయినప్పుడు.. సెట్‌దేముంది’ | Nagarjuna feels bad over to annapurna studio fire accident | Sakshi
Sakshi News home page

‘మనం’  సెట్‌ కాలిపోవడం బాధగా ఉంది

Nov 13 2017 9:16 PM | Updated on Sep 5 2018 9:47 PM

 Nagarjuna feels bad over to annapurna studio fire accident - Sakshi

సాక్షి, హైదరాబాద్ : అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ‘మనం’ సినిమా సెట్ పూర్తిగా కాలిపోవడంతో చాలా బాధగా ఉందని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి నటించిన సినిమా కావడంతో ఈ సెట్ ను చూసినప్పుడల్లా ఆయన గుర్తొచ్చేవారని అన్నారు. మనుషులే పోయినప్పుడు.. సెట్‌ కాలిపోతేముందిలే అన్న నాగర్జున.. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడం సంతోషకరమైన విషయం అన్నారు.

ఇంత పెద్దగా ఎగిసిపడుతున్న మంటలు ఎలా ఆర్పుతారనుకున్నా..కానీ ఫైర్‌ సిబ్బంది కేవలం 15 నిమిషాల్లో పని పూర్తి చేశారన్నారు. ఈ సందర్భంగా ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌కు, పోలీసులకు నాగర్జున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమా సెట్ కు రూ.2 కోట్లకు పైనే అప్పుడు ఖర్చయిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ‘రాజు గారి గది’ తో పాటు పలు సినిమాలకు ఈ సెట్ లోనే షూటింగ్ జరిగిందని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement