రూ. 200 కోట్ల కలెక్షన్లు వచ్చాయి | MS Dhoni-The Untold Story touches Rs 200 crore-mark at box office | Sakshi
Sakshi News home page

రూ. 200 కోట్ల కలెక్షన్లు వచ్చాయి

Oct 16 2016 8:37 AM | Updated on Sep 4 2017 5:25 PM

రూ. 200 కోట్ల కలెక్షన్లు వచ్చాయి

రూ. 200 కోట్ల కలెక్షన్లు వచ్చాయి

బాలీవుడ్ చిత్రం ఎంఎస్ ధోనీ-ద అన్టోల్డ్ స్టోరీ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

ముంబై: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన బాలీవుడ్ చిత్రం ఎంఎస్ ధోనీ-ద అన్టోల్డ్ స్టోరీ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సెప్టెంబర్‌ 30న విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 204 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించినట్టు నిర్మాతలు చెప్పారు.

భారత్లో 175.7 కోట్లు, విదేశాల్లో 29 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు నిర్మాతలు తెలిపారు. బయోపిక్ సినిమాల్లో బిగ్గెస్ట్ ఓపెనర్గా, ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో సుల్తాన్ తర్వాత అత్యధిక వీకెండ్ కలెక్షన్లు సాధించిన రెండో చిత్రంగా ఎంఎస్ ధోనీ నిలిచింది. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుషాంత్ సింగ్ రాజ్పుట్ టైటిల్ రోల్లో నటించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement