వైరలవుతోన్న లతా మంగేష్కర్‌ ట్వీట్‌

Lata Mangeshkar Urges MS Dhoni Do Nott Think About Retirement - Sakshi

వరల్డ్‌కప్‌ సెమీస్‌లో టీమిండియా ఓటమితో ధోని రిటైర్మెంట్‌ వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ ప్రపంచకప్‌ అనంతరం ధోని రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కోహ్లీసేన సైతం కప్ గెలిచి ధోనికి ఘనంగా వీడ్కోలు పలకాలని భావించింది. అయితే, అనూహ్యంగా సెమీస్‌లోనే భారత్‌ ఇంటిదారి పట్టింది. ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్ వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. అయితే ఈ వార్తలపై ప్రముఖ సింగర్‌ లతా మంగేష్కర్‌ స్పందించారు. ధోని రిటైర్మెంట్‌ ఆలోచనను మానుకోవాలంటూ ట్విటర్‌ వేదికగా కోరారు.

‘ధోని జీ. మీరు రిటైర్‌ కాబోతున్నారనే వార్తలు వింటున్నాను. దయచేసి అలాంటి ఆలోచనలు చేయకండి. దేశానికి మీ అవసరం ఎంతో ఉంది. దేశం కోసం మీరు మరేన్నొ మ్యాచ్‌లు ఆడాలి. మీ మనసులోంచి రిటైర్మెంట్‌ ఆలోచనను తీసేయాల్సిందిగా నా విన్నపం’ అంటూ లతా మంగేష్కర్‌ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌కు అభిమానులు భారీ ఎత్తున మద్దతు తెలిపారు. ఇప్పటి వరకూ ఈ ట్వీట్‌ను 14 వేల మంది లైక్‌ చేయగా.. 700 మంది రీట్వీట్‌ చేశారు. ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌ తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌ చేతిలో కోహ్లి సేన 18 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top