
మళ్లీ పెళ్లాడతారట!
‘తను వెడ్స్ మను’.. హిందీ ప్రేక్షకులకు ఓ మంచి జ్ఞాపకంగా నిలిచిన సినిమా. ఈ సినిమాతో యువతకూ,
‘తను వెడ్స్ మను’.. హిందీ ప్రేక్షకులకు ఓ మంచి జ్ఞాపకంగా నిలిచిన సినిమా. ఈ సినిమాతో యువతకూ, కుటుంబ ప్రేక్షకులకూ అమితంగా దగ్గరయ్యారు కంగనా. ఇప్పుడీ సినిమా కొనసాగింపుకు రంగం సిద్ధమవుతోంది. సినిమా పేరు ‘తను వెడ్స్ మను రిటర్న్స’. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో క్రిషికా లుల్లా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ విషయాన్ని క్రిషికా లుల్లా స్వయంగా మీడియాకు వెల్లడించారు. ‘‘ ‘తను వెడ్స్ మను’ బాలీవుడ్లో ఓ ట్రెండ్ సెట్టర్. ఈ సినిమాకు సీక్వెల్గా అద్భుతమైన స్క్రిప్ట్ సిద్ధం చేశాడు దర్శకుడు ఆనంద్. త్వరలోనే సెట్స్కి తీసుకెళ్లనున్నాం. ‘తను వెడ్స్ మను’ కంటే ఓ స్థాయి పైనే ఉంటుందీ సినిమా. త్వరత్వరగా షూటింగ్ పూర్తి చేసి 2015 ప్రథమార్ధం చివర్లో కానీ, ద్వితీయార్ధం మొదట్లోకానీ సినిమాను విడుదల చేస్తాం. కంగనా, మాధవన్లే ఇందులో కూడా జంటగా నటిస్తారు’’ అని క్రిషిక తెలిపారు.