‘తన బయోపిక్‌కు తానే డైరెక్టర్‌’

Kangana Ranaut to Direct Her Own Biopic - Sakshi

బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ మరో సంచలనానికి తెరతీసారు. ఇటీవల ఝాన్సీ లక్ష్మీబాయి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన మణికర్ణిక సినిమాతో ఎన్నో వివాదాలకు కేంద్రబింధువైన కంగనా త్వరలో మరోసారి మెగాఫోన్‌ పట్టేందుకు రెడీ అవుతున్నారు. మణికర్ణిక సినిమాలోని కొంత భాగానికి దర్శకత్వం వహించిన అనుభవంతో తన బయోపిక్‌ను తానే డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు కంగనా.

ఈ విషయాన్ని కంగనా స్వయంగా వెల్లడించారు. అంతేకాదు కంగనా బయోపిక్‌కు బాహుబలి, మణికర్ణిక సినిమాలకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్‌ కథ అంధించనున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమాలో తన జీవితంలోని ఎత్తు పల్లాలను చూపించబోతున్నట్టుగా తెలిపారు కంగనా. బాలీవుడ్ తో ఎలాంటి సంబంధాలు లేకపోయినా ఓ మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఎన్నో విజయాలు సాధించిన ఓ విజేత కథగా తన బయోపిక్‌ రూపొందించబోతున్నట్టుగా తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top