ఏపీ సీఎంకి రుద్రమదేవి డైరెక్టర్‌ సూటి ప్రశ్న | Is it Wrong to Question ? Director Gunasekhar ask AP CM Chandrababu naidu | Sakshi
Sakshi News home page

ఏపీ సీఎంకి రుద్రమదేవి డైరెక్టర్‌ సూటి ప్రశ్న

Nov 15 2017 8:20 PM | Updated on Aug 18 2018 6:11 PM

Is it Wrong to Question ? Director Gunasekhar ask AP CM Chandrababu naidu - Sakshi

హైదరాబాద్‌ : ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల్లో 'రుద్రమదేవి' చిత్రానికి ఏ ఒక్క కేటగిరీలోనూ అవార్డు దక్కకపోవడంపై ఆ చిత్ర దర్శకుడు గుణశేఖర్‌ మండిపడ్డారు. ఈ విషయంపై స్పందిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. 'ప్రశ్నించడం తప్పా?...' అంటూ ఆయన చేసిన ట్వీట్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పలు ప్రశ్నలు సంధించారు.

చారిత్రాత్మక చిత్రం ''రుద్రమదేవి''కి వినోదపు పన్ను మినహాయింపు ఎందుకివ్వలేదు...? మరో చారిత్రాత్మక చిత్రం ''గౌతమిపుత్ర శాతకర్ణి''కి మినహాయింపు ఎందుకిచ్చారని గుణశేఖర్‌ ప్రశ్నించారు. మహిళా సాధికారతను చాటి చెబుతూ తీసిన ''రుద్రమదేవి'', మూడు ఉత్తమ చిత్రాల కేటగిరీలో ఏదో ఒక దానికి ఎంపిక కాలేకపోయిందని, కనీసం జ్యూరీ గుర్తింపునకు కూడా నోచుకోలేకపోయిందని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement