ఒకటే లోకం

Iddari Lokam Okate release date locked - Sakshi

రాజ్‌ తరుణ్, షాలినీ పాండే జంటగా నటించిన చిత్రం ‘ఇద్దరిలోకం ఒకటే’. జీఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు నిర్మించారు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబరు 25న సినిమా విడుదల కానుంది. ‘‘క్యూట్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని యూత్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా దర్శకుడు తెరకెక్కించారు’’ అన్నారు ‘దిల్‌’ రాజు. ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, కెమెరా: సమీర్, సంగీతం: మిక్కీ.జె. మేయర్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top