నడిగర్‌ సంఘం ఎన్నికలకు లైన్‌క్లియర్‌ | Election Commission Given Permission To Nadigar Sangam Elections | Sakshi
Sakshi News home page

నడిగర్‌ సంఘం ఎన్నికలకు లైన్‌క్లియర్‌

Jun 22 2019 10:30 AM | Updated on Jun 22 2019 10:30 AM

Election Commission Given Permission To Nadigar Sangam Elections - Sakshi

తమిళసినిమా: దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల పోరు రచ్చగా మారడంతో పాండవర్‌ జట్టు, స్వామి శంకరదాస్‌ జట్టులు వాగ్యుద్ధానికి దిగాయి. నడిగర్‌ సంఘం ఎన్నికలను నిలిపివేయాలని తమిళనాడులోని ఓ అధికారి మద్రాసు హైకోర్టులో ఇటీవల పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై పాండవర్‌ జట్టు కోర్టులో దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరుగగా యథాప్రకారం ఈ నెల 23వ తేదీన ఎన్నికలు జరిగేలా తీర్పు వెలువడింది. అయితే, ఎన్నికలు ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు జరపరాదని షరతు విధించింది. కోర్టు ఆదేశాలతో పాండవర్‌ జట్టు హర్షం వ్యక్తం చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement