‘చౌరస్తా’నుంచి మరో సాంగ్‌.. బాహుబలినై | ChowRaasta Band Release Mr Pellam Song Viral On Social Media | Sakshi
Sakshi News home page

‘చౌరస్తా’నుంచి మరో సాంగ్‌.. ఈ సారి

Apr 2 2020 2:58 PM | Updated on Apr 2 2020 2:58 PM

ChowRaasta Band Release Mr Pellam Song Viral On Social Media - Sakshi

ఫైల్‌ ఫోటో

చౌరస్తా బ్యాండ్‌.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోంది ఈ పేరు. నలుగురితో నారాయణ అన్నట్టు కాకుండా తమ కంటూ ఓ ప్రత్యేక స్టైల్‌ను అలవరుచుకున్న ఈ బృందం నయాట్రెండ్‌కు తగ్గ పాటలను అందిస్తూ ప్రజలను మైమరిపిస్తున్నారు. ఇప్పటికే మహమ్మారి కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించేలా ‘చేతులెత్తి మొక్కుతా చేయిచేయి కలపకురా’ అంటూ ఈ బృందం పాడిన పాట సో​షల్‌ మీడియాలో సరికొత్త ట్రెండ్‌ సృష్టించింది. తాజాగా లాక్‌డౌన్‌ సందర్భంగా ప్రస్తుతం ఇళ్లల్లోని పరిస్థితులను వివరిస్తూ మరో పాటను విడుదల చేశారు. 

లాక్‌డౌన్‌తో ఇంట్లో కష్టాలు పడుతున్న భర్తలకు.. ఆ భర్తలను భరిస్తున్న భార్యలకు ఈ పాట అంకితం అంటూ మొదలైన సాంగ్‌ ‘బాహుబలినై బట్టలుతికితే.. అవాక్కయ్యే తెలుపు లేదని, బంటు నేనై అంట్లు తోమితే.. అద్దమంటి మెరుపే లేదని’ అంటూ వచ్చే లిరిక్స్‌ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ సాంగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. రామ్‌, శ్రీనివాస్‌, యశ్వంత్‌, బాలా ఈ నలుగురు కలిసి చౌరస్తా అనే జానపద బ్యాండ్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఊరెళ్లిపోతా మామా, మాయ వంటి పాటలు సంగీత ప్రియుల్ని ముఖ్యంగా యూత్‌కు బాగా కనెక్ట్‌ అయ్యాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement