భీమనేనితో... అల్లుడు శీను | Sakshi
Sakshi News home page

భీమనేనితో... అల్లుడు శీను

Published Wed, Apr 1 2015 10:26 PM

భీమనేనితో... అల్లుడు శీను - Sakshi

 ‘అల్లుడు శీను’ చిత్రంతో చేరువైన బెల్లంకొండ శ్రీనివాస్ తదుపరి చిత్రం ఏమిటా అన్న ఆసక్తికి ఎట్టకేలకు తెర పడింది. ఈ యువ హీరో నటించనున్న రెండో చిత్రం షూటింగ్ బుధవారం హైదరాబాద్ లో ప్రారంభమైంది. వినోదభరిత చిత్రాలకు చిరునామా అయిన భీమనేని శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకుడే కాక నిర్మాత కూడా కావడం విశేషం. గుడ్ విల్ సినిమా పతాకంపై స్వీయ దర్శకత్వంలో ఆయన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత పోకూరి బాబూరావు కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు వినాయక్ క్లాప్ ఇచ్చారు. బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. భీమనేని మాట్లాడుతూ,‘‘తమిళంలో ‘సుందర పాండ్యన్’, కన్నడంలో ‘రాజహులి’ గా విడుదలై విజయాన్ని సాధించిన కథను చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మార్పులు చేశాం’’ అని చెప్పారు. ఈ నెల 16 నుంచిరెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, ఆగస్టు 28న ఈ విడుదల చేయనున్నామని ఎగ్జిక్యూటివ్ నిర్మాత వివేక్ కూచిభొట్ల తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాత: భీమనేని సునీత, సమర్పణ: భీమనేని రోషితా సాయి.
 

Advertisement
Advertisement