సంక్రాంతి సంరంభానికి బాలకృష్ణ ‘డిక్టేటర్’గా సమాయత్తమవుతున్నారు. ఇప్పటి వరకు సంక్రాంతి రేసులో బాలకృష్ణ ఎక్కువ విజయాలు అందుకోవడంతో ‘డిక్టేటర్’పై అంచనాలు రెట్టింపయ్యాయి. రానున్న సంక్రాంతికి బాలయ్య బాక్సాఫీస్ను శాసిస్తారని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ‘లౌక్యం’తో గోపీచంద్కు మంచి విజయాన్ని అందించిన దర్శకుడు శ్రీవాస్ హీరో బాలకృష్ణను ‘డిక్టేటర్’గా స్టయిలిష్ లుక్లో చూపిస్తున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజలి, సోనాల్చౌహాన్, అక్ష నాయికలు.
శ్రీవాస్ మాట్లాడుతూ - ‘‘ఢిల్లీ, హర్యానాల్లో జరిగిన షెడ్యూల్తో ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. ఇక ఒక పాట, ఒక యాక్షన్ ఎపిసోడ్ బ్యాలెన్స్ ఉన్నాయి. డిఫరెంట్గానే ఉంటూనే బాలకృష్ణ ఇమేజ్కు తగ్గట్టు సాగే యాక్షన్, ఎమోషనల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ సినిమా పాటలను ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు.
సంక్రాంతిని శాసించే... డిక్టేటర్!
Published Wed, Dec 2 2015 12:07 AM
Related news
-
బాలయ్య కుటుంబ ఆస్తులు రూ.465.35 కోట్లు.. అయ్యన్నపై కేసులు 17
సాక్షి నెట్వర్క్: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. 2022–23లో ఆదాయం రూ.10 కోట్లు, స్థిరాస్తులు రూ.103 కోట్లు, చరాస్తులు రూ.82 కోట్లు కలిపి బాలయ్యకు మొత్తం రూ.185 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్లో పొందుపరిచారు. క్రిమినల్ కేసులు ఏవీ లేవని పేర్కొన్నారు. నందమూరి హిందూ అవిభాజ్య కుటుంబంలో బాలకృష్ణకు స్థిరాస్తులు రూ.28.91 కోట్లు, చరాస్తులు రూ.2.41 కోట్లుగా చూపారు. బాలయ్య సతీమణి వసు«ంధర పేరిట రూ.179.28 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా.. అందులో స్థిరాస్తులు రూ.38.90 కోట్లు, చరాస్తుల విలువ రూ.140.38 కోట్లుగా చూపారు. కుమారుడు మోక్షజ్ఞ పేరిట స్థిరాస్తులు రూ.11.11 కోట్లు, చరాస్తులు రూ.58.64 కోట్లు కలిపి బాలకృష్ణ కుటుంబానికి మొత్తం ఆస్తుల విలువ రూ.465.35 కోట్లుగా చూపారు. అయ్యన్నపాత్రుడిపై 17 కేసులు చింతకాయల అయ్యన్నపాత్రుడి పేరిట రూ.5,04,61,500, అతని భార్య పేరిట రూ.10,84,63,200 విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. అయ్యన్నపాత్రుడు దళితులపై దూషణలు చేయడం.. అధికారులపై చిందులు వేయడం పరిపాటిగా మార్చుకున్నారు. ఈ క్రమంలోనే అతనిపై 17 కేసులు సైతం నమోదయ్యాయి. ఉమ్మడి విశాఖలోనే కాకుండా రాష్ట్రంలో పలుచోట్ల ఆయనపై కేసులు ఉన్నాయి. మాగుంట వద్ద ఉన్నది రూ.18 వేలేనట దేశవ్యాప్తంగా పేరున్న మద్యం వ్యాపారి. కానీ.. ఆయన చేతిలో ఉన్న నగదు రూ.18,529 మాత్రమేనట. టీడీపీ ఒంగోలు పార్లమెంటరీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మాగుంట శ్రీనివాసులరెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తన చేతిలో ఉన్న నగదుతో పాటు భార్య వద్ద రూ.6,68,134, ఉమ్మడి కుటుంబ సభ్యుల (హెచ్యూఎఫ్) వద్ద రూ.67,854 నగదు ఉందని తెలిపారు. చరాస్థుల కింద తనకు రూ.4,58,30,319 ఉండగా.. భార్య పేరిట రూ.17,98,70,139, ఉమ్మడి కుటుంబం కింద రూ.4,24,94,762 ఉన్నట్టు తెలిపారు. తన పేరిట రూ.1.09 కోట్లు స్థిరాస్తులు ఉండగా.. భార్య పేరిట రూ.30,04,44,600, ఉమ్మడి కుటుంబ సభ్యుల కింద రూ.4,29,44,876 ఉన్నట్టు పేర్కొన్నారు. కేసుల చిట్టా విప్పిన బొండా ఉమా విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు (ఉమా) ఎన్నికల అఫిడవిట్లో తన కేసుల చిట్టా విప్పారు. 2006 నుంచి 2024 ఏప్రిల్ వరకు వివిధ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో తనపై 23 కేసుల నమోదైనట్టు వెల్లడించారు. 2006 నుంచే తనపై కేసులు ఉన్నప్పటికీ 2014, 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ల వీటి ప్రస్తావన తేలేదు. భార్య, కుమారుడితో పాటు తన పేరిట మొత్తంగా రూ.98.53 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నట్టు వివరించారు. కావలి అభ్యర్థికీ కారు లేదట! కావలి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దగుమాటి వెంకటకృష్ణారెడ్డి (కావ్య కృష్ణారెడ్డి) ఆస్తుల విలువ రూ.153.27 కోట్లు అని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. అతని పేరున రూ.115.67 కోట్లు, భార్య శ్రీలత పేరిట రూ.31.92 కోట్లు, కుమార్తె వెన్నెల పేరిట రూ.5.67 కోట్లు చర, స్థిరాస్తులున్నట్టు చూపారు. కృష్ణారెడ్డి కారు లేదని అఫిడవిట్లో పేర్కొన్నారు. వేమిరెడ్డి దంపతులకు 19 కార్లు కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆమె భర్త ప్రభాకర్రెడ్డి ఉమ్మడి ఆస్తులు విలువ రూ.715.62 కోట్లుగా ఎన్నికల ఆఫిడవిట్లో పేర్కొన్నారు. ప్రశాంతిరెడ్డి పేరుతో రూ.76.35 కోట్లు, ప్రభాకర్రెడ్డి పేరుతో రూ.639.26 కోట్లు ఉన్నట్టు వెల్లడించారు. వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.1.17 కోట్లు ఉండగా.. షేర్లు, బాండ్ల రూపంలో రూ.10.62 కోట్లు ఉన్నాయి. ఆ దంపతులిద్దరికీ రూ.6.96 కోట్ల విలువైన 19 కార్లు ఉన్నట్టు తెలిపారు. -
కళసాకారం..
ప్రభుత్వ బడులకు పండుగొచ్చింది. స్కూళ్లు పిల్లలతో కళకళలాడుతున్నాయి. ఐదేళ్ల క్రితం ఎవరూ కలలో కూడా ఊహించనిదీ విప్లవాత్మక మార్పు.మార్పులో మేము సైతం అంటూ పాలుపంచుకుంది హైదరాబాద్ కు చెందిన యువ ఆర్టిస్ట్ విజయ్,స్వాతి జంట. పిల్లల నవ్వులతో మమేకమైంది.. బడి ప్రాంగణాలే కాన్వాసుగా వారి ఆటపాటలే కుంచెలుగా మలచి వర్ణచిత్రాలను ‘రంగ’రించింది. పాఠశాలకు జీవం ఉట్టిపడే చిత్రాలతో కొత్త కళ తెచ్చింది. ఆ యువ ఆర్టిస్టు జంటతో ‘సాక్షి’ ముచ్చటించింది. వారి మాటల్లోనే.. అలా మొదలైంది: మేం ఇద్దరం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నాం వాటితో అనుబంధం ఉంది. గత 2017లో ఒక ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని మాకు చేతనైన విధంగా రంగులద్దాం. ఆ సమయంలో ఎవరైనా చొరవ తీసుకుని అన్ని స్కూళ్లకు ఇలాగే రంగులద్దితే ఎంత బావుండో అనుకున్నాం. పూజారి కోరిందీ దేవుడు ఇచ్చిందీ ఒకటే అన్నట్టు ఆంధ్రప్రదేశ్ స్కూల్లో లార్జ్స్కేల్ ఆర్ట్ వర్క్స్ కోసం మమ్మల్ని చింతూరు ఐటీడీఎ పీవో అప్రోచ్ అయ్యారు. అలా 2020లో జులై నెలలో నాడు–నేడు కోసం మా వర్క్ స్టార్ట్ అయింది. అది కేవలం మా బొమ్మల వరకే కాదనీ, మొత్తం పాఠశాలల రూపు రేఖలే మార్చే కార్యక్రమం అనీ తెలిశాక మా ఆనందం రెట్టింపయింది. మా కల నిజం అవుతోందని సంబరపడ్డాం. ఆర్ట్ వర్క్ కోసం రోజుల తరబడి ఆయా స్కూళ్లలో గడిపాం. పిల్లలు చదువుకుంటున్నప్పుడు, ఆడుకుంటున్నప్పుడు.. హ్యాపీగా ఫీలైన జాయ్ మూమెంట్స్ని క్యాప్చర్ చేసి వాటినే ఆర్ట్ వర్క్స్గా మలిచాం. తద్వారా పిల్లలు మరింతగా వాటితో కనెక్ట్ అయ్యారు. వాళ్లని వాళ్లు 30–30 స్కేల్ ఆర్ట్ వర్క్లో చూసుకుని థ్రిల్ అయ్యేవారు. పదే పదే చూసుకోవడం, పేరెంట్స్కి, ఫ్రెండ్స్కీ చూపించే సమయంలో వాళ్ల ముఖంలో సంతోషం అమూల్యం. మాటల్లో వర్ణించలేం. అలా హెడ్ మాస్టర్, టీచర్లు, స్టాఫ్.. మా స్కూల్కు బెస్ట్ ఆర్ట్ వర్క్ చేయండి అంటూ అడిగి మరీ చేయించుకున్నారు. చాలా వరకూ ట్రైబల్ ఏరియా స్కూల్స్లో చేశాం. ప్రతీ స్కూల్లో వర్క్ ముగించుకుని వచ్చేటప్పుడు చుట్టాలను వదిలి వెళ్తున్న ఫీలింగ్ కలిగింది. ప్రభుత్వ పాఠశాలల పునర్వైభవ విజయంలో మాకు కూడా చిన్న పాత్ర ఉండడం జీవితంలో మేం మర్చిపోలేని మధుర జ్ఞాపకం. – సత్యార్థ్ నాడు అలా.. ఇకపై ఎవరైనా ప్రభుత్వ పాఠశాలల గురించి మాట్లాడాలంటే నాడు–నేడుకు ముందు, ఆ తర్వాత అని విభజించి మాట్లాడాల్సిందే. సర్కారు బడులంటే టాయిలెట్స్ కనిపించవు, పైనా కిందా గచ్చు పెచ్చులూడుతూ ఉంటుంది. వానపడితే పుస్తకాలు బల్లల కింద దాచుకోవాలి. ఫ్యాన్లు శబ్ధాలు చేస్తాయి తప్ప తిరగవు. బాగా పాఠాలు చెప్పే టీచర్లు కరువు. ప్రాంగణం పందులు, పశువులకు ఆలవాలం. అందువల్లే పిల్లలను చేర్చలేని దుస్థితి. నేడు ఇలా.. బెస్ట్ బెంచీలు, గ్రీన్ బోర్డ్స్, ఫ్లోరింగ్, ఫ్యాన్స్, టాయిలెట్స్, క్రీడా పరికరాలతో సహా ప్లే గ్రౌండ్, పుస్తకాలు, బ్యాగ్స్, ట్యాబ్స్.. పూటకో మెనూతో మధ్యాహ్న భోజనం.. ఇలా కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా చక్కటి వసతులు సమకూరాయి. పిల్లలు, టీచర్లలో నవోత్సాహం కనిపిస్తోంది. ఇప్పుడు ఏ మాత్రం అవకాశం ఉన్నా ప్రభుత్వ పాఠశాలల్లోనే జాయిన్ చేయాలి అనే పరిస్థితి వచ్చింది. -
‘సహనం నా బ్లడ్లోనే లేదు..’ అభిమానులపై బాలయ్య పంచుల పర్వం
-
అభిమానిపై చెయ్యి చేసుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ
సాక్షి, సత్యసాయి: ఎన్నికల ప్రచారం మొదలుపెట్టక ముందే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. తన శైలిలో దబ్బిడి దిబ్బిడి షురూ చేసేశారు. సహనం కోల్పోయి ఓ అభిమానిపై చెయ్యి చేసుకున్నారు. శనివారం ఉదయం సత్యసాయి జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఇవాళ్టి నుంచి బాలయ్య బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం మొదలుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెలికాఫ్టర్లో కదిరికి ఆయన చేరుకున్నారు. ఆయన ల్యాండ్ కాగానే అభిమానులు కొందరు ఆయన దగ్గరికి వచ్చారు. ఈ క్రమంలో ఓ అభిమాని సెల్ఫీ కోసం యత్నించగా.. బాలయ్య సహనం కోల్పోయారు. ఆ అభిమానిపై చెయ్యి చేసుకున్నారు. అంతటితో ఆగకుండా అభిమానులపైనా ఆగ్రహం ప్రదర్శించారు. పక్కనే ఉన్న నేతలు సైతం ఆ అభిమానిని దూరంగా నెట్టేశారు. ఇదీ చదవండి: బాలయ్య కోపం ఎవరి మీద?.. అభిమానులు జర జాగ్రత్త! -
బాలయ్య కోపం ఎవరి మీద?
ఇప్పటిదాకా ఒక లెక్క. ఈసారి మాత్రం ఓ లెక్క. హిందూపురం కంచుకోటను బద్ధలు కొట్టి టీడీపీని ఓడించేందుకు వైఎస్సార్సీపీ ఇప్పటికే వ్యూహం సిద్ధం చేసింది. సామాజిక సమీకరణాల్లో భాగంగా దీపికకు సీటు కేటాయించింది. తద్వారా గత ఐదేళ్లలో మొక్కుబడిగా నియోజకవర్గాన్ని సందర్శిస్తున్న నందమూరి బాలకృష్ణకు చెక్ పెట్టడానికి రంగం సిద్ధం చేసింది. అయితే నామినేషన్ల పర్వం దగ్గర పడింది కదా!. బహుశా అందుకేనేమో షూటింగ్కు బాలయ్య పేకప్ చెప్పినట్లున్నారు. ప్చ్.. హిందూపురంలో ఈసారి బాలయ్య గెలుపు కష్టమే. టీడీపీ తమ కంచుకోటగా భావిస్తూ వస్తున్న హిందూపురం నియోజకవర్గంలో.. అదీ టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తున్న బలంగా వినిపిస్తున్న టాక్ ఇదే. ఈ నేపథ్యంలో.. శనివారం నుంచి కదిరి నుంచి ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ పేరుతో ఎన్నికల ప్రచారానికి బాలయ్య సిద్ధపడుతున్నారు. పనిలో పనిగా.. ఎన్డీయే అభ్యర్థుల విజయం కోసం రాయలసీమలో ఆయన విస్తృతంగా పర్యటిస్తారట. విశేషం ఏంటంటే.. ‘బాలయ్య అన్స్టాపబుల్’ పేరుతో ఇందుకోసం ప్రత్యేకంగా ఓ బస్సును కూడా రూపొందించారు. ఆ బస్సు గురించి చివర్లో ఓ ముచ్చట చెప్పుకుందాం. అది ఎన్టీఆర్ క్రేజ్ వల్లే.. హిందూపురం.. ఈ సీటు నుంచే స్వర్గీయ నందమూరి తారక రామారావు 1985లో తొలిసారి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 1998లో మరోసారి గెలిచారు. 1994లో మూడవసారి గెలిచి 1996లో మరణించేటంతవరకూ కొనసాగారు. అంటే.. పదకొండేళ్ల పాటు ఏకధాటిగా హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆయన మరణించాక జరిగిన ఉప ఎన్నికలో అదే సీటు నుంచి ఆయన తనయుడు నందమూరి హరికృష్ణ గెలిచారు ఆయన 1999 దాకా దాదాపుగా మూడున్నరేళ్ల పాటు పనిచేశారు. ఆ తర్వాత 1999, 2004, 2009 ఎన్నికల్లోనూ అక్కడ వరుసగా టీడీపీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. అయితే.. రాష్ట్ర విభజన నేపథ్యంలో.. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారం చేజిక్కించుకుంది. ఆ సమయంలో హిందూపురం నుంచి పోటీ చేసి బాలయ్య ఎమ్మెల్యేగా తొలిసారి నెగ్గారు. అయితే..ఆ సమయంలో బాలయ్య 16 వేల ఓట్ల తేడాతో వైఎస్సార్సీపీ అభ్యర్థిపై గెలిచారు. ఇక రెండోసారి 2019 ఎన్నికల్లోనూ 18 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. రెండు ఎన్నికల్లోనూ పది శాతం ఓట్ల తేడాతో బాలయ్య నెగ్గారు. ఈ రెండుసార్లూ కాంగ్రెస్, జనసేన అభ్యర్థుల కారణంగా ఓట్లు చీల్చాయి. అంటే.. ఏ లెక్కన చూసుకున్నా బాలయ్య ‘అఖండ’ మెజారిటీ ఏం గెలవలేదు. పైగా ఈసారి బాలయ్యపై వ్యతిరేకతకు అదనంగా.. సీఎం జగన్ సంక్షేమ పాలన పట్ల ప్రజల్లో ఆదరణ, రాయలసీమ ఎన్నికల బాధ్యతలు మంత్రి పెద్దిరెడ్డి తీసుకోవడంతో.. బాలయ్యకు హిందూపురంలో ఈసారి టీడీపీకి గడ్డు పరిస్థితే ఎదురుకావొచ్చనే చర్చా బాగా నడుస్తోంది. దూరం దూరం.. పీఏల యవ్వారం! అభివృద్ధి పనులా?.. హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే హోదాలో నందమూరి బాలకృష్ణ సందర్శించింది వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. షూటింగ్ల బిజీలతోనే ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలోనే మా ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ పోస్టర్లు, దున్నపోతుల మీద బాలయ్య పేర్లు రాసి ధర్నాలు నిర్వహించేదాకా పరిస్థితి వెళ్లింది. మొదటి దఫాగా గెలిచిన సమయంలోనే కాదు.. ప్రతిపక్ష హోదాలో రెండోసారి కూడా అదే తీరును బాలయ్య కనబరుస్తూ వచ్చారు. అందుకే అక్కడి ప్రజల్లో ఆయన తీరుపై వ్యతిరేకత బలంగా ఉంది. అంతెందుకు.. ఇప్పుడు ఆయన చేపడుతున్న బస్సు యాత్ర హడావిడి కూడా.. ఎన్నికల నేపథ్యంలోనే అదీ సుదీర్ఘకాలం పది నెలల తర్వాత ఆయన మళ్లీ నియోజకవర్గం వైపు అడుగులేయిస్తోన్నదే. వీటన్నింటికి తోడు ఆయన పీఏలపై వచ్చిన ఆరోపణలు ఆయన ఇమేజ్ను మరింత పల్చన చేశాయి. గతంలో హిందూపురంలో బాలయ్య తీరుకు నిరసనగా సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టులు అభిమానులు జర జాగ్రత్త! నెలల తరబడి నియోజకవర్గంలో బాలకృష్ణ కానరాక టీడీపీ కార్యకర్తల్లో నిరుత్సాహం పేరుకుపోయి ఉంది. ఇప్పుడు ఎట్టకేలకు ఆయన పర్యటన ఖరారైంది. ఎమ్మెల్యే నియోజకవర్గానికి వస్తున్నారన్న సమాచారంతో టీడీపీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ, బాలయ్య ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రతీసారి జరుగుతున్న చమక్కులు చూస్తున్నదే. అభిమానులు, కార్యకర్తలతో బాలయ్య వ్యవహరించే తీరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానుల్ని నెట్టేయడం, కుదిరితే కొట్టడం.. దానిని ‘ప్రేమ’ అంటూ ప్రచారం చేసే ఎల్లో సోషల్ మీడియా పేజీలు, అభిమాన సంఘాలు అబ్బో.. ఈసారి కూడా సోషల్ మీడియా ఆ స్టఫ్ను బాగానే పంచే అవకాశమూ లేకపోలేదు. బస్సుపై బాలయ్య గుస్సా అన్స్టాపబుల్ పేరుతో ఆయన ఓ ఓటీటీలో హోస్ట్ షో నిర్వహించుకున్నారు. ఫస్ట్ సిరీస్ ఏదో బాగానే ఆడింది. కానీ, రెండోది పాపం ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ప్రచార యాత్ర బస్సుకు కూడా అన్స్టాపబుల్ అని పేరు పెట్టారు. దాని మీద ఓ మూలకు టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు చిత్రాన్ని ఉంచారు. ఇంకోపక్కన కూటమి నేతల ఫొటోలతో పాటు బాలయ్య ఫొటోను ఉంచారు. ఇంతకీ బస్సు మీద(పోస్టర్లో) బాలయ్య గుర్రుగా చూస్తుంది ‘అలగ జాతి, సంకర జాతి’ అని అవమానించిన బ్రదర్నా?.. లేదంటే ‘మక్కీ చూస్’ అంటూ గతంలో తిట్టిపోసిన మోదీనా? ఈ రెండూ కాకుంటే.. తండ్రి నుంచి సీటు లాక్కుని, పవన్తో పొత్తుల విషయం తనతో మాట వరుసకు కూడా చర్చించకుండా, స్కిల్ కేసులో అరెస్టై జైల్లో ఉన్నప్పుడు కూడా కనీసం టీడీపీ మెయిన్ సీట్లో కూర్చోనివ్వకుండా అడ్డుకున్న వియ్యంకుడు చంద్రబాబు నాయుడ్నా?..
Related News by category
-
తొమ్మిది నెలల కిందే బన్నీకి సాక్షి ఎక్స్లెన్స్ అవార్డ్..
జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న అల్లు అర్జున్ను తొమ్మిది నెలల కిందే సాక్షి మీడియా గ్రూప్ ఎక్స్లెన్స్ అవార్డ్తో సత్కరించింది. పుష్ప సినిమాలో వినూత్నమైన నటనతో పాటు తెలుగు అభిమానులను అత్యద్భుతంగా అలరించినందుకు ఎక్స్లెన్స్ అవార్డ్తో గౌరవించింది. ఆ సందర్భంగా మాట్లాడిన స్టైలిష్ స్టార్.. సాక్షి మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. ఇంత మంచి సినిమా ఇచ్చిన డైరెక్టర్ సుకుమార్కు థ్యాంక్యూ చెప్పారు. సాక్షి ఇచ్చిన ఎక్స్లెన్స్ అవార్డ్ను మూవీ టీంకు డెడికేట్ చేస్తున్నట్లు చెప్పారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై రూపొందిన ‘పుష్ప’ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించారు. ఫాహద్ ఫాజిల్ విలన్ పాత్ర పోషించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. సాక్షి ఎక్స్ లెన్స్ అవార్డ్స్లో అల్లు అర్జున్కు మోస్ట్ పాపులర్ హీరో అవార్డ్.. -
Hello Meera Movie: హాలో మీరా.. దర్శకుడి గొప్ప ప్రయోగమిది!
రాతి పులుసు 'అనే యూరప్ జానపద కథ ఒకటి ఉన్నది. భలే చమత్కారమైన కథ. వీలయినంత గుర్తున్నది చెప్పడానికి ప్రయత్నిస్తా రండి.' ఒకానొక మనిషి కాలినడకన తోవ పట్టుకు పోతున్నాడు. ఎక్కడికో తెలీదు. నడిచీ నడిచీ కడుపులో దహించుకుపోయేంత ఆకలి. మనిషి మట్టి కొట్టుకు పోయి ఉన్నాడు. జేబులో నాలుగు డబ్బులు ఉండి ఉంటే ఏ బండి చక్రాన్నో పట్టుకునేవాడు. ఆ మాత్రం కూడా లేనట్టు ఉంది. నడవగా నడవగా ఒక ఊరు తగిలింది. మొదట కనపడిన ఇంటి తలుపు ముందు నిలబడి తినడానికి ఏమైనా ఉంటే కాస్త పెట్టమని అడిగాడు. ఇంట్లో ఏముందో ఏంలేదో తెలీదు. ఇతగాడి వాలకం చూస్తే మాత్రం ఏమీ పెట్టబుద్ది అయినట్లు లేదు. రెండో ఇల్లు అంతే, ఆ ఇంటి తరువాత ఒక నాలుగు గడపలు దాటి అడిగినా అయిదో ఇంట్లో కూడా అదే స్పందన. మన కథానాయకుడు ఎవరైనా కానీ, ఏమైనా కానీ చాలా తెలివైన వాడు. ప్రాధేయపడి అడిగాం ఫలితం లేదు ఈ ఊరిలో ఇది కాదు పద్దతి అనుకున్నాడు. ఈసారి తలుపు తట్టిన ఇంటి వారికి మాత్రం తినడానికి ఏమైనా ఇవ్వండి అని అడగలేదు. ఇప్పుడే ఇస్తా ఒక కుండ ఉంటే ఇవ్వమని అడిగాడు . కుండ ఇచ్చినావిడ తలుపుకానుకుని ఏం చేస్తాడా అని చూస్తుంది. కుండని అలా నేలమీద పెట్టి అటు ఇటూ కనపడిన మూడు రాళ్లని, కాసింత ఎండు కొమ్మలు, గడ్డి పోచలు పట్టుకు వచ్చి మూడు రాళ్ల పొయ్యిగా ఆమర్చి దానిపై కుండని పెట్టి పొయ్యి వెలిగించ బోతూ వెనక్కి తిరిగి, కాసిన్ని మంచి నీళ్లు దొరుకుతాయా అవి ఉంటే చాలు పని అయిపోతుంది అన్నాడు. ఆవిడ కుండ నిండా నీళ్లు తెచ్చి ఇచ్చి చోద్యం చూస్తుంది. మనవాడు కుండ కింద మంట పెట్టి జేబులో చేయి పెట్టి ఒక గులక రాయిని బయటకు తీశాడు, భక్తిగా కళ్లకద్దుకుని ఆ రాయిని కుండలో జార విడుస్తూ ఆవిడ కేసి చూసి నవ్వాడు మరేం లేదమ్మా పులుసు రాయి అంతే అన్నాడు. పులుసు రాయా, అదేంటి ఎప్పుడూ వినలేదే ? అని వింత పోయింది ఆవిడ. ఈ రాయి వేసి పులుసు కాస్తే ఉంటుంది , అబ్బా అని లొట్టలేసి చూస్తారుగా అంటూ ఒక కర్ర పుల్ల తీసుకుని కుండలో కలియతిప్పడం మొదలు పెట్టాడు. తిప్పి తిప్పి మరిగిన నీళ్లు కాసిన్ని నాలుక మీద వేసి రుచి చూసుకుని అహా అన్నట్టు కనుబొమలు ఎగరేసి వెనక్కి తిరిగి చూశాడు. అప్పటికే ఈ రాయి చమత్కారం విని ఇరుగింటి ఆశమ్మ, పొరుగింటి పోశమ్మ, ఎదురింటి బూశమ్మ తతిమ్మా అమ్మలు కూడా చేరారు. పులుసు తయారీ దారు తనలో తాను అనుకున్నట్టుగా అంటూనే వారికి వినిపించేలా, బావుంది, చాలా బావుంది కానీ కాస్త చింతపండు, ఉప్పు, ఇంత జీలకర్ర ఉండి ఉంటే ఇంకా అద్భుతంగా తయారవుతుంది. ఈ మాటలు చెవిన పడ్డమే ఆలస్యం వెంటనే దినుసులు దిగి పోయాయి. చిరు నవ్వుతో వాటిని అందుకుని ఆ నీళ్లలోకి వంపాడు, పులుసు మరుగుతోంది, ఆవిరి తేలుతోంది. ఏం పర్లేదు కాస్త సమయం పడుతుంది. అన్నట్లూ మీరు పుట్టి బుద్ది ఎరిగిన దగ్గరి నుంచి ఈ ఊరు దాటి పొయిన వారిలా లేరు, ఇక్కడి నుండి దక్షిణం వైపుకు వంద మైళ్ల దూరంలో జింత్ర అనే గ్రామం ఉంది. ఆ ఊరిలో పండుతాయండి క్యారెట్లు అబ్బో ఎంత రుచి అనుకున్నారు, ప్రపంచంలో అట్లాంటి కారెట్లు మరెక్కడా దొరకవు. వస్తున్నప్పుడు పాపం ఒక రెండు దుంపలు మీకోసం తేవాల్సింది. అన్నట్లూ మీ ఊర్లో క్యారెట్ ఎట్లా ఉంటాయి, పర్లేదా? అనే ప్రశ్న ముగిసి ముగియకమునుపే ఒకావిడ క్యారెట్ బుట్ట పట్టుకు వచ్చింది. ఆ బుట్టలోనే ఒక వైపు ఉర్లగడ్డలు కూడా ఉన్నాయి. పర్లేదే! చూడ్డానికి రంగు బాగా ఉన్నాయి, రుచి పరీక్షిస్తే పొలా అని ఒక చేత్తో నాలుగు కేరట్ దుంపలు ఇంకో చేత్తో ఆరు ఉర్లగడ్డలు ఆ మరుగు తున్న నీటిలో పడేసీ మళ్ళీ కబుర్లు మొదలు పెట్టాడు. ఉర్లగడ్డ పడిందిగా పులుసు చిక్కనయింది, ఘుమఘుమలు కూడా మొదలయ్యాయి. మళ్ళీ పుల్ల పట్టుకు తిప్పి రుచి చూడబోయాడు, ఈ సారి ఒక ఇల్లాలు చేయి చాపింది, పులుసు చుక్కలు ఆవిడ చేతిలో ఒంపాడు, ఆవిడ తన అరచేతిని నాకేసి తన్మయత్వంగా మొహం పెట్టింది, మరి ఇంట్లో తరిగిన క్యాబేజీ పోగులు ఉన్నాయి అవి కూడా వేద్దామా? అని అడిగింది. దానికేమమ్మా భాగ్యం? పులుసు రాయి దేనినయినా రుచితుల్యం చేస్తుంది పాపం వెళ్లి తెచ్చుకోండి అని ఉదారంగా అనుమతి ఇచ్చేశాడు. మొత్తానికి ఆసారి ఆయిన్ని, ఈసారి ఈయిన్ని దినుసులు చేరుతూనే ఉన్నాయి. ఇంతలో వేటకని అడివికి వెళ్లిన మగవాళ్లు పల్లెకు వచ్చేశారు. నలుగుడు ముక్క లేకుండా పులుసు ఏమిటి అని ఒక పెద్దాయన కోప్పడి తను వేటాడి తెచ్చిన కుందేళ్ల తాజా మాంసం ముక్కలు అందులో మరగనిచ్చాడు. పులుసు తయారు. అంతకన్నా అద్భుతమైన పులుసు ముందెన్నడూ తిని ఎరగలేదని తిన్నవాళ్లంతా ఏకగ్రీవపడ్డారు. తాను కూడా ఆ ఊరి అంత మంచివాళ్లని మునెపెన్నడూ ఎరిగి ఉండనని దానయ్య కూడా ప్రకటించి తన గుర్తుగా ఉంచుకొమ్మని కానుకగా ఆ పులుసు రాయిని వారికి ఇచ్చేసి తన దారి తాను చూసుకున్నాడు . ఈ కథని మా మిత్రుడు శ్రీనివాస్ చదివి కాని, విని కాని ఉంటారని నేను అనుకోవడం లేదు. ఆయనకు ఈ కథకు ఉన్న సంబంధం అల్లా, ఎట్లా అయితే ఆ కథలో కథానాయకుడు వనరులు ఏమీ లేని చోట, నలుగురూ నాలుగు చేతులు వేసినప్పుడు ఒక మహద్భుతం చేయవచ్చని నమ్మికతో నడుస్తున్నాడో , శ్రీనివాస్ ది అదే నమ్మిక. సినిమాలు తీయాలి. దాని కొరకు ముందుగా ఒక సినిమా అయినా తీయాలి అనేదే ఆయన లక్ష్యం. చేతిలో మ్యాజిక్ ఉంది. కాని చూసే వాడికి అవి ఖాళీ చేతుల్లా కనపడుతున్నాయే.. మరెలా అని కథ అనే గులకరాయిని పట్టుకుని ఆయన నడక మొదలెట్టాడు. పిడికిట్లో అది ఒదిగి ఉంది. నడక అనంతరం గుప్పిట విప్పి చూస్తే అది ముత్యంలా తయారయింది. ఒక పాతికేళ్ల అమ్మాయి, పేరు మీరా. రేపొక్క రోజు ఆగితే ఎల్లుండి తన పెళ్లి. బట్టలు తెచ్చుకోడానికి బయలు దేరిన అమ్మాయి సాయంత్రం అయిదు దాటింది.. ఆరు దాటింది.. ఏడయినా ఇల్లు చేరదే ! ఎక్కడా తప్పి పోయింది లేదు .. అమ్మ చేసినా.. నాన్న చేసినా , తమ్ముడు చేసినా.. కాబోయే శ్రీవారు, వారి అమ్మగారు, చిన్ననాటి మిత్రులు ఎవరు చేసినా ఫోన్ ఎత్తుతోంది .. వారితో మాట్లాడుతూనే ఉంది.. జవాబు చెబుతూనే ఉంది. పోని ఇదేమయినా ఇష్టం లేని పెళ్లా అంటే అదేం కాదు.. ప్రేమించిన అబ్బాయినే పెళ్లాడబోతుంది. మరేమిటి? ఇంటి నిండా బంధువులు, విడిదింట్లో మగపెళ్లి వారు, హోటల్ గదుల్లో మిత్రులు అంతా వచ్చి ఉన్నారు. టైలర్ షాపు నుంచి తిన్నగా ఇంటికి రావాల్సిన అమ్మాయి.. ఇంటి వైపు కాక ఊరిని వదిలి పెట్టి హైదరాబాదు నగరం వైపు.. నేషనల్ హైవే మీద ఒంటరిగా కారు నడుపుతూ వెళ్లావలసిన అవసరం ఏంటి? ఇదేం క్రైం థ్రిల్లర్ కాదు, యాక్షన్ ఓరియెంటెడ్ జానర్ అసలే కాదు. పూర్తిగా సంసార పక్ష సినిమా.. కుటుంబ గాథా చిత్రం. మనుషులు, అనుబంధాలు, నమ్మకాలు, ద్రోహాలు, కాసిన్ని కన్నీళ్లు, గోరంత దీపమంత ధైర్యం వెలుగులో కొండంత భయాన్ని ఎదుర్కొన్న ఒక ఆడపిల్ల కథ. సినిమా అంతా ఇందులో మీరా అన్న పాత్ర వహించిన గార్గేయి తప్పా మరో మనిషి మొహం కనపడదు. ఎన్నో గొంతులు వినపడతాయి. ఎన్నెన్నో భావనలు అర్థమవుతాయి. ఇందులో మనకు వినపడిన ప్రతి కరుకు గొంతు, ప్రతి మెత్తని పలుకు, ప్రతి కంగారు స్వరం ఆ మనిషి ఎలా ఉండి ఉంటారనేది మనకంటూ ఒక ఊహని కలుగ జేస్తుంది. మనం కళ్లతో సినిమా చూస్తూ.. ఊహల్లో సినిమాలోని పాత్రలని నిర్మించుకుంటాం. ఇంతకన్నా కథని ఏమి చెప్పలేను. ఇదంతా దర్శకత్వ ప్రతిభ . డైరెక్టర్ మూవీ ఇది. తెలుగులో గొప్ప ప్రయోగం ఇది. సగటు ప్రేక్షకుడి పైన ఉన్న నమ్మకం ఈ సినిమా . గర్వించే మన సినిమా ఇది. సినిమా చివరలో సుఖాంతంలో పెద్ద సమస్య నుంచి మీరా బయట పడుతుంది. ఆ మొహంలో, కళ్లల్లో, పెదవుల మీద గొప్ప రిలీఫ్ . ఆ సమయంలో ఏం చేయాలి? పిడుగును ఒడిసి పట్టి నలిపి పడేసినంత, కొండలని పిండి కొట్టి చెల్లా చెదురు చేసినంత గొప్ప ఫీల్ కావాలి. ఆ విజయాన్ని ఆస్వాదించాలి. కానీ ఆ అమ్మాయి చేసిన మొట్ట మొదటి పని తన తమ్ముడికి కాల్ కలిపి, బట్టలు కుట్టిన టైలర్కి చాలా అవసరంగా డబ్బులు కావాలి. అర్థ రాత్రి దాటి ఉన్నా పర్లేదు, ముందు ఆ అమ్మాయికి డబ్బులు అందించమంటుంది. సూది కుట్టంత చిన్న మనిషి, ఆవిడ అవసరం దగ్గర ఆపేసిన గొప్ప సినిమా ఇది. తప్పక చూడండి. -అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి -
పోస్టర్ బాగుంది – నాగార్జున
‘‘ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ అందర్నీ ఆకట్టుకునేలా బాగుంది. ఈ సినిమా హిట్ అయి, యూనిట్కి మంచి పేరు రావాలి’’ అన్నారు అక్కినేని నాగార్జున. బొమ్మ దేవర శ్రీదేవి సమర్పణలో తేజ బొమ్మదేవర, రిషికా లోక్రే జంటగా బొమ్మదేవర రామచంద్ర రావు దర్శక–నిర్మాణ సారథ్యంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను నాగార్జున రిలీజ్ చేశారు. ‘‘ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: వికాస్ బాడిస, కెమెరా: వాసు. -
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న గాడ్ ఫాదర్.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాలీవుడ్ సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం పలు రికార్డులను తిరగరాస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. (చదవండి: బాలీవుడ్లో ‘గాడ్ ఫాదర్’ హవా.. 600 స్క్రీన్స్ పెంపు) గతంలో మెగాస్టార్ ఖైదీ నెం.150 మాత్రమే రూ.164 కోట్లతో ఆయన కెరీర్లో బెస్ట్గా నిలిచిందన్నారు. త్వరలోనే గాడ్ఫాదర్ ఈ రికార్డును అధిగమించనుందని ట్వీట్ చేశారు. గతంలో విడుదలైన ఆచార్య వసూళ్లను అధిగమించింది. గాడ్ ఫాదర్ 2019లో వచ్చిన మలయాళ చిత్రం లూసిఫర్కి తెలుగు రీమేక్. మోహన్ రాజా దర్శకత్వం వహించిన గాడ్ ఫాదర్ చిత్రంలో నయనతార, సత్యదేవ్ నటించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. #GodFather ENTERS ₹100 cr club at the WW Box Office. — Manobala Vijayabalan (@ManobalaV) October 8, 2022 -
25 ఏళ్లలోపు పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఎవరో తెలుసా ?
Heroines Who Married At Young Age: సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఆసక్తికరంగా ఉండే టాపిక్లో పెళ్లి ఒకటి. మధ్యతరగతి కుటుంబాల్లో పిల్లలకు వివాబం ఎప్పుడు జరిపిస్తారు అని చుట్టుపక్కల వాళ్లు విసిగిస్తూనే ఉంటారన్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి లొల్లి సెలబ్రిటీలను కూడా వెంటాడుతూ ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎప్పుడు వివాహమాడాతారు. పెళ్లికానీ ప్రసాద్ (హీరోలు)లు ఎంతమంది ఉన్నారు అని ఆసక్తి చూపుతారు. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే వారికి అవకాశాలు తగ్గిపోతాయనే భయం ఉంటుందని అంటారు. అందుకేనేమో 30 ఏళ్లు దాటినా కూడా తాళి కట్టించుకోని హీరోయిన్లు చాలామందే ఉన్నారు. అలాంటి సినీ ఇండస్ట్రీలో 20 ఏళ్లకే పెళ్లి చేసుకున్నా కథనాయికలు కూడా ఉన్నారు. పాతికేళ్లు కూడా దాటకుండానే కెరీర్ పీక్స్లో ఉండగా వివాహం చేసుకుని షాక్ ఇచ్చిన హీరోయిన్లూ ఉన్నారు. పాతికేళ్లలోపు వయసుండి పెళ్లిపీటలు ఎక్కిన హీరోయిన్లు ఎవరో తెలుసుకుందామా ! 1. సాయేషా సైగల్ అఖిల్, బందోబస్తు, టెడ్డీ, యువరత్న సినిమాలతో అలరించిన ముద్దుగుమ్మ సాయేషా సైగల్. ఈ హీరోయిన్ 2019లో హీరో ఆర్యను పెళ్లి చేసుకుంది. అప్పుడు ఆమెకు 22 ఏళ్లు. 2. నిషా అగర్వాల్ చందమామ కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ సోలో, సుకుమారుడు, ఏమైంది ఈ వేళ వంటి సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అక్టోబర్ 18, 1989లో పుట్టిన ఈ అమ్మడు 24 ఏళ్ల వయసులో వివాహం చేసుకుంది. అక్క కాజల్ అగర్వాల్ కంటే ముందే డిసెంబర్ 28, 2013లో పెళ్లి పీటలు ఎక్కింది నిషా. 3. షాలినీ మాధవన్ సరసన నటించిన 'సఖి' చిత్రం ఎంత బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. ఆ చిత్రం తర్వాత షాలినీ యూత్ గుండెల్లో సఖిగా కొలువైంది. షాలినీ 21 వయసులో హీరో అజిత్ను 2000లో వివాహమాడింది. 4. జెనీలియా జెనీలీయా బొమ్మరిల్లు సినిమాతో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా జెన్నీకి ఫుల్ క్రేజ్ తీసుకొచ్చింది. ఆగస్టు 5, 1987న పుట్టిన హాసిని 2012లో బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్ను వివాహం చేసుకుంది. అప్పుడు జెనీలియాకు 25 ఏళ్లు. 5. నజ్రియా నజీమ్ రాజారాణి, బెంగళూర్ డేస్, ట్రాన్స్ సినిమాలతో ఎంతగానో ఆకట్టుకున్న హీరోయిన్ నజ్రియా నజీమ్. ప్రముఖ మళయాల నటుడు ఫహద్ ఫాజిల్ భార్య నజ్రీయా నజీమ్. వీరిద్దరూ 2014లో పెళ్లి చేసుకున్నారు. అప్పుడు నజ్రియాకు 20 ఏళ్లు. ఇది చదవండి: సమంత సరికొత్త ఫొటోలు.. నెట్టింట్లో వైరల్
Advertisement
Photos
View allVideo
View allTuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
వాట్సప్లో మారిన రంగులు.. కారణం అదేనంటూ
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement